Vijayendra: అల్పసంఖ్యాకులను మెప్పించేందుకు సీఎం ఎటువంటి స్థాయికైనా దిగజారుతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayendra: కర్ణాటకలో ముస్లింలకు గృహ పథకాల కింద రిజర్వేషన్ను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచే నిర్ణయం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శల మోత మోగుతోంది. నేడు ( జూన్ 20) కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా మతపరమైన మెప్పింపు రాజకీయమేనని విమర్శించారు. సిద్ధరామయ్య అల్పసంఖ్యాకులను మెప్పించేందుకు ఎటువంటి స్థాయికైనా దిగజారగలరని నిరూపించుకున్నారు. ఇది వారి విధానానికి అద్దంపడుతోంది. బీజేపీ ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉండదు. కానీ, దేశవిద్రోహ శక్తులకు మాత్రం కచ్చితంగా వ్యతిరేకమే అని స్పష్టం చేశారు.
Read Also: Thailand: ఫోన్ కాల్ లీక్.. థాయ్లాండ్ యువ ప్రధాని పదవికి గండం!
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
కాంగ్రెస్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను పాటిస్తున్నామంటూ చెబుతుంది. కానీ, ఇది వారి చర్యలతో స్పష్టంగా ఒప్పుకోలేనిదని.. అల్పసంఖ్యాకులకు ఓటు బ్యాంకుగా చూడటం తప్పుకదా, వారికి విద్యను, సాధికారతను అందించడమే అసలు అవసరం అని అన్నారు. అలాగే ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు మతం, జాతిని చూడకుండా ప్రతి వర్గానికి లబ్ధిని చేకూర్చాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనా వరకు ఇప్పటివరకు ముస్లింలు పేదరిక రేఖ కిందే ఉన్నారంటే, దానికి కారణం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపిత అణచివేత విధానమే అని అన్నారు.
Read Also:Marriage: కొడుకుతో నిశ్చితార్థం.. కాబోయే కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. అసలు ఏం జరిగిందంటే?
ఈ వ్యవహారాన్ని బీజేపీ అసెంబ్లీలో తీవ్రంగా లేవనెత్తనున్నట్లు ప్రకటించిన విజయేంద్ర, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో కలిసి నిరసనల బాట పడతామని చెప్పారు. కోర్టు ఇప్పటికే రాజకీయ నాయకత్వ తప్పిదం అని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ సీఎం మౌనం వహించటం దురదృష్టకరం అన్నారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రస్తావించిన ఆయన, ఈ బాధ్యతను నిర్దోష అధికారులు, ఐపీఎస్ అధికారులపై వేశారన్నారు. కానీ, ఇది ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమే. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నైతికంగా బాధ్యత వహించాలని అన్నారు.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!