Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జల్సాలకు అలవాటు పడి, కష్టపడకుండా అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాశతో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు బొద్దుల యుగేందర్ను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన రూ. 5 లక్షల నగదు, 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు రికవరీ చేశారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఈ కేసు వివరాలను వెల్లడించారు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. సృజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ (32) అనే వ్యక్తి వృత్తిరీత్యా నేరస్తుడు. ఇతనిపై గతంలోనూ అనేక దొంగతనాల కేసులు ఉన్నాయి. నేర ప్రవృత్తి కారణంగా గతంలో ఇతనిపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేసి జైలుకు పంపారు. అయితే.. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా యుగేందర్ తన పద్ధతి మార్చుకోలేదు.
ఏప్రిల్ 26వ తేదీ తెల్లవారుజామున మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో ఉన్న రూ. 5 లక్షల నగదును, ఒక బంగారు చైన్ను ఎత్తుకెళ్లాడు. దొంగిలించిన సొత్తును ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు.
Also Read
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
కాలేజీలో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక ఆధారాలు, నమ్మదగిన సమాచారంతో నిందితుడిని దుర్షెడ్ గ్రామంలోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడమే కాకుండా.. గతంలో చింతకుంట ఆంజనేయస్వామి గుడిలో హుండీ దొంగతనం చేసినట్లు కూడా ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడు దాచిన చోటు నుంచి రూ. 5 లక్షల నగదును, 10 గ్రాముల బంగారు చైన్ను స్వాధీనం చేసుకున్నారు. నేరస్థులపై నిరంతరం నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి హెచ్చరించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించి సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాన్ని సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!