Honour Killing: కూతురికి పురుగుల మందు తాగించి.. గొంతు నులిమి హత్య చేసిన తల్లిదండ్రులు!
- కరీంనగర్ జిల్లాలో పరువు హత్య
- కూతురికి పురుగుల మందు తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు
- ఆత్మహత్యగా చిత్రికరించి పోలీసులకు చిక్కిన తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో తల్లిదండ్రులే కన్న కూతురిని అతి దారుణంగా హత్య చేశారు. తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు కూతురి హత్యను ఆత్మహత్యగా చిత్రికరించి.. చివరకు పోలీసులకు చిక్కారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటన గత నెల 14న జరగగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు బాలిక తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వాయిపేట గ్రామానికి చెందిన రాజు రెడ్డి, లావణ్య దంపతులకు కుమార్తె అర్చన (16) ఉంది. సోమారం మోడల్ స్కూల్లో అర్చన ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ పెళ్లైన యువకుడితో అర్చన ప్రేమాయణం సాగించింది. యువకునికి భార్యతో పాటుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం తల్లిదండ్రులకి తెలియడంతో కూతురిని మందలించారు. అయినా అర్చన ప్రవర్తనలో మార్పు రాలేదు. కూతురి వల్ల కుటుంబ పరువు పోతుందనే భయంతో తల్లిదండ్రులు ఓ పథకం పన్నారు.
Also Read
- Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
Also Read: Crime News: నల్లకుంటలో దారుణం.. పిల్లల ముందే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త!
నవంబర్ 14న రాత్రి నిద్రిస్తున్న అర్చనకు తల్లిదండ్రులు బలవంతంగా పురుగుల మందు తాగించారు. అయినా ఆమె చనిపోకపోవడంతో.. తండ్రి గొంతు పిసికి చంపేశాడు. తమ కూతురు కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి భోజనం చేసి అందరం నిద్రపోయామని, తెల్లవారుజామున 4 గంటలకు చూసేసరికి అర్చన నోట్లో నురుగు కనిపించిందని, అప్పటికే మృతి చెందినట్లు పోలీసులకు చెప్పారు. అర్చనకు కడుపునొప్పి సహా థైరాయిడ్ సమస్య కూడా ఉందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇది పరువు హత్యగా తేల్చారు.
తాజావార్తలు
-
Nagarjuna: బర్త్డే వేళ నాగార్జున ఫ్యాన్స్కు షాక్.. నెట్ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
-
Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
-
Yamaha YZF-R2: R15 కంటే మరింత పవర్ఫుల్! 26.1bhp పవర్తో కొత్త Yamaha YZF-R2 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
ట్రెండింగ్
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!