Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- టీమిండియా టీ20 జట్టులోకి తిరిగి రావడమే తన లక్ష్యం
- టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్..
- ‘నా వంతు కృషి చేస్తున్నా’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: టీమిండియా మాజీ టీ20 కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకోవడంపై తన ప్రయత్నాలు కాస్త ముమ్మరంగానే చేస్తున్నట్లు కనపడుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక కాకపోయినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడమే తన లక్ష్యమని తాజాగా స్పష్టం చేశాడు. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నానని, అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు.
తన అంతర్జాతీయ భవిష్యత్తుపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. జట్టులోకి తిరిగి రావడానికి తన వంతుగా చేయాల్సిన ప్రతిదీ చేస్తున్నానని చెప్పాడు. పరిస్థితులు అనుకూలిస్తే మిగతావన్నీ వాటంతట అవే సెట్ అవుతాయని పేర్కొన్నాడు. ప్రో గోవింద లీగ్ సందర్భంగా సూర్యకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. “నేను చాలా కష్టపడుతున్నాను. నా వంతుగా చేయాల్సిన ప్రతిదీ చేస్తున్నాను. పరిస్థితులు అనుకూలంగా ఉంటే అన్నీ వాటంతట అవే జరుగుతాయి” అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.
Also Read
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
ఇటీవల బ్యాట్తో సూర్యకుమార్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ముఖ్యంగా ఐపీఎల్లో అతని ప్రదర్శన అంతగా మెప్పించలేకపోయింది. దీంతో సెలెక్టర్లు టీమిండియా కోసం రాబోయే రెండేళ్ల ప్రణాళికపై దృష్టి సారిస్తూ యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సూర్యకుమార్ను ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక చేయలేదు. ఒకప్పుడు ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్గా నిలిచిన సూర్యకుమార్.. గత కొంతకాలంగా నిలకడ కోసం ఇబ్బంది పడుతున్నాడు. రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సూర్యకుమార్ భారత జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. అతని నాయకత్వంలో భారత్ ఈ ఏడాది మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. అయితే ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు శ్రేయస్ అయ్యర్కు అప్పగించడంతో పాటు సూర్యకుమార్ను టీ20 జట్టు నుంచి పూర్తిగా తప్పించారు.
మరోవైపు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోనూ టీమిండియా టీ20ల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో భారత్ 2-0 తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 4-0తో పరాజయం ఎదురైంది. అయితే జింబాబ్వేతో జరిగిన సిరీస్లో టీమిండియా పుంజుకుంది. ఆ సిరీస్ను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్పై ఒత్తిడి కొనసాగుతోంది. రాబోయే మ్యాచ్ల్లో అతను స్థిరంగా మంచి ఫలితాలు సాధించాల్సి ఉంటుంది.
2028లో టీ20 ప్రపంచకప్తో పాటు ఒలింపిక్స్ కూడా జరగనున్న నేపథ్యంలో భారత జట్టు మేనేజ్మెంట్ దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ వరుసగా విఫలమైతే ప్రత్యామ్నాయ కెప్టెన్ కోసం టీమ్ మేనేజ్మెంట్ ఆలోచించే అవకాశం ఉంది. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ను తిరిగి అందుకుంటే.. అతనికి మరోసారి టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకోగలడు.
తాజావార్తలు
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!