Kakarla Suresh: ఒక్క అవకాశం ఇవ్వండి ఉదయగిరి నియోజకవర్గ తలరాత మారుస్తా..!
ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం జమ్మలపాలెం నుంచి ఎన్డీయే కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆదివారం నాడు పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జమ్మలపాలెంలో కాకర్ల ఇంటింటి ప్రచారం చేశారు. ఆ తర్వాత లింగరాజు అగ్రహారంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ- ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్, కాకర్ల ప్రవీణ దంపతులకు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఇక, కాకర్ల సురేష్ దంపతులు పల్లె జనానికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని వేడుకున్నారు.
Read Also: YS Bharathi: చంద్రబాబు వ్యాఖ్యలకు వైఎస్ భారతి కౌంటర్.. వయసులో పెద్దవారు.. అలా మాట్లాడటం తప్పు..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల రణరంగంలో సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ అనే నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మార్పు లేదన్నారు. ఉదయగిరి నియోజకవర్గం దశ దిశ మార్చేందుకు వచ్చానన్నారు. దోచుకుని దాచుకునేందుకు రాలేదు.. కష్టపడి సంపాదించిన సొమ్మును పుణ్యభూమికి ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో వచ్చానన్నారు. ఎన్నికల సంగ్రామంలో యుద్ధ వీరుడుగా మీ ముందుకు వచ్చానని వీర సైనికులుగా తిలకం దిద్ది ముందుకు నడిపించాలని ఆయన కోరారు.
Read Also: Uttarakhand : ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు.. ప్రమాదంలో స్కూల్స్, కాలేజీలు
ఒక్క అవకాశం ఇవ్వండి ఉదయగిరి నియోజకవర్గ తలరాత మారుస్తానని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం.. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాల డెవలప్మెంట్ చెందుతుందన్నారు. 24000 కిలో మీటర్లు రోడ్లు వేసిన ఘనత చంద్రబాబుది.. అంగన్వాడీల ద్వారా ఒక్క లక్ష 80000 మందికి పౌష్టికాహారం అందజేశామని గుర్తు చేశారు. ఈ ఎన్నికల రణరంగంలో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ అనే నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
Read Also: Fire accident: యూపీలోని జలౌన్ సెషన్స్ కోర్టులో భారీ అగ్నిప్రమాదం
అలాగే, ఉదయగిరి మండలంలోని దాసరపల్లి గ్రామంలో కాకర్ల సునీల్, కాకర్ల సురేఖ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. టీడీపీకి ఓటు వేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని కాకర్ల సునీల్ దంపతులు అన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. మే 13న జరగ పోలింగ్ రోజు ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ ని, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!