Kakani Govardhan Reddy: చంద్రబాబువి అన్నీ శంకుస్థాపనలే.. ప్రారంభోత్సవాలు ఉండవు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: చంద్రబాబువి అన్నీ శంకుస్థాపనలే.. వేటికీ ప్రారంభోత్సవాలు చేయలేదని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నో ఆదర్శవంతమైన పథకాలు తీసుకువచ్చారు.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని తెలిపారు.. దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే అందించారు.. నామినేటెడ్ పదవుల్లో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఇచ్చారు.. కరోనాతో పాటు ఎన్నో విపత్కర పతిస్థితులు వచ్చినా ఇచ్చిన హామీలను అమలు చేశారంటూ ప్రశంసలు కురిపించారు.
Read Also: GVL Narasimha Rao: ప్రపంచ దేశాల నేతలకు బాస్లా మారిన మోడీ.. ఐదో బలమైన దేశంగా భారత్
Also Read
మహానాడు పేరుతో చంద్రబాబు ఆడిన డ్రామాలను ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు కాకాణి.. ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ను గుర్తుకు తెచ్చుకుంటారు.. మహానాడులో మాత్రమే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని అడుగుతారు.. మరి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నపుడు ఎందుకు గుర్తుకు రాలేదు? చంద్రబాబుకు చిత్ర శుద్ధి లేదు అని మండిపడ్డారు.. ఇక, టీడీపీ మొదటి మేనిఫెస్టో విడుదల చేశారు.. ఇంకా ఎన్ని వస్తాయో చూడాలన్న ఆయన.. 2014లో ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదు.. అప్పుడు మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు ఇచ్చి.. 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదు అని ఆరోపించారు.. చంద్రబాబువి అన్నీ శంకుస్థాపనలే.. వేటికీ ప్రారంభోత్సవాలు చేయలేదని ఆరోపించారు.. కృష్ణపట్నం, రామయ్య పోర్టులకు కేవలం శంకుస్థాపనే చేశారు.. కానీ సీఎం జగన్ అన్నింటినీ పూర్తి చేసి ప్రారంభిస్తున్నారని తెలిపారు. అసలు, చంద్రబాబు పేరు చెబితే ఏ పథక మైనా గుర్తుకు వస్తుందా..? అని ప్రశ్నించారు మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి.
తాజావార్తలు
-
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
-
Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
-
Bangladesh: భారత్తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..
-
Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
-
Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!