Kaikala Satyanarayana: స్టార్స్ తో సత్యనారాయణ చిత్రాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaikala Satyanarayana: నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబుతోనూ తరువాతి తరం స్టార్ హీరోలయిన చిరంజీవి,బాలకృష్ణతోనూ సత్యనారాయణ సొంత చిత్రాలు నిర్మించడం విశేషం. యన్టీఆర్ ద్విపాత్రాభినయంతో తెరకెక్కిన `గజదొంగ` చిత్ర నిర్మాణంలో చలసాని గోపితో కలసి పాలు పంచుకున్నారు సత్యనారాయణ. తాను ఎన్నో చిత్రాలలో యన్టీఆర్ డ్యుయల్ రోల్ పోషించగా, ఆయనకు డూప్ గా నటించారు సత్యనారాయణ. అందువల్లేనేమో యన్టీఆర్ తో తాను నిర్మించిన `గజదొంగ` చిత్రాన్ని రామారావు ద్విపాత్రాభినయంతోనే నిర్మించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఇక ఏయన్నార్ హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో సత్యనారాయణ, తన తమ్ముడు కైకాల నాగేశ్వరరావు నిర్మాతగా `బంగారు కుటుంబం` చిత్రం నిర్మించారు. ఆ సినిమా కూడా మంచివిజయం సాధించడమే కాదు, 1994లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని అందుకుంది. నిజానికి సత్యనారాయణ, కృష్ణ హీరోగా నిర్మించిన `మామాఅల్లుళ్ల సవాల్`తోనే నిర్మాతగా మారారు. రమా పిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి కె.ఎస్.ఆర్.దాస్ దర్శకులు. శ్రీదేవి నాయికగా నటించిన ఈ చిత్రం అప్పట్లో జనాదరణ చూరగొంది. తరువాత కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో `ఇద్దరు దొంగలు` చిత్రం నిర్మించారు. ఈ సినిమా 1984 సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. 1986లో శోభన్ బాబు హీరోగా కె.మురళీమోహన రావు దర్శకత్వంలో `అడవి రాజా` చిత్రాన్ని నిర్మించారు సత్యనారాయణ. ఈ సినిమా ఓ మోస్తరుగా అలరించింది.
Read Also: Satyanarayana in Hindi: హిందీలో సత్యనారాయణ!
Also Read
తరువాతి తరం హీరోలయిన చిరంజీవితో సత్యనారాయణ `కొదమసింహం` కౌబోయ్ మూవీని నిర్మించారు. కె.మురళీమోహన రావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. హిందీలో ప్రాణ పోషించిన పలు పాత్రలను తెలుగులో సత్యనారాయణ ధరించి ఆకట్టుకున్నారు. అలా “నిప్పులాంటి మనిషి, యుగంధర్, నా పేరే భగవాన్“ వంటి సినిమాలలో హిందీలో ప్రాణ చేసిన పాత్రలను తెలుగులో సత్యనారాయణ ధరించి ఆకట్టుకున్నారు. అందువల్ల ప్రాణ్ అంటే సత్యనారాయణకు ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే ఇందులో ఓ కీలక పాత్రను ప్రాణ్ ను ఎంచుకున్నారు సత్యనారాయణ. “తనకు నటునిగా గుర్తింపు సంపాదించి పెట్టిన హిందీ రీమేక్స్ లో ప్రాణ్ పోషించిన పాత్రలు తెలుగులో నాకు ఎంతో పేరు సంపాదించాయి. ఈ విధంగానైనా నా అభిమాన నటుడు ప్రాణ్ ను సన్మానించుకున్నాను“ అంటూ సత్యనారాయణ అన్నారు. ఇక బాలకృష్ణ హీరోగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో `ముద్దుల మొగుడు` అనే చిత్రాన్ని నిర్మించారు సత్యనారాయణ. ఈ రెండు చిత్రాలు తమ రమాఫిలిమ్స్ పతాకంపైనే నిర్మించారు. `కొదమసింహం` కంటే ముందు ఇతరులతో కలసి చిరంజీవి హీరోగా `చిరంజీవి` అనే చిత్రాన్ని నిర్మించారు సత్యనారాయణ. ఇలా నిర్మాతగానూ సత్యనారాయణ అలరించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!