KA Paul: 60 శాతం నా వైపే.. వార్ వన్సైడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul Promises To Develop Munugode As America: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే! స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా మునుగోడు పరిధిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన.. స్థానికులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి… స్వీట్లు పంపిణీ చేశారు. చాయ్ పెట్టి ప్రజలకు టీ తాగించారు. అంతేనా సెలూన్ షాప్కు వెళ్లి కటింగ్ చేయించుకున్నారు. ఇప్పటికే మునుగోడులో కేఏ పాల్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు మునుగోడులో పోటీ చేస్తున్న విషయం విదితమే. అయితే తన పార్టీ తరఫున వేసిన నామినేషన్ చెల్లదని ఈసీ ప్రకటించింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పాల్… ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు.
Target Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి టార్గెట్.. కాంగ్రెస్ పక్కా ప్లాన్
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
ప్రచారం నిర్వహిస్తోన్న పాల్ హామీల వర్షం కురిపిస్తున్నారు. మునుగోడులో 60 నెలల్లో లేని అభివృద్ధి 6 నెలల్లో చేసి పడేస్తా అని వ్యాఖ్యానించారు. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా తనకే మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. 6నెలల్లో ఒక మండలానికి కాలేజీ, ఉచిత ఆసుపత్రి, ప్రతి మండలానికి 1000 ఉద్యోగాలు ఇచ్చి 6నెలల్లో మునుగోడును అమెరికాను చేసి చూపిస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు. మునుగోడులో ప్రజలు 60శాతం ఆల్రెడీ డిసైడ్ చేశారన్నారు. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించడానికి ఇంకా కష్టపడితే ఆ మూడు పార్టీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. వార్ వన్సైడ్ అయిపోయిందనే… తెరాస గుండాలు, కాంగ్రెస్ గుండాలు అడ్డుకుంటున్నారని కేఏ పాల్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!