KA Paul: కేంద్రపాలిత ప్రాంతంగా తిరుపతి?
- తిరుమల లడ్డు వివాదంపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు
- తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు చేయకూడదన్న కేఏ పాల్
- కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించానని వెల్లడి
KA Paul: తిరుపతి లడ్డు వివాదాన్ని అర్థం చేసుకున్నందుకు సుప్రీంకోర్టుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ హైకోర్టులో సీబీఐతో విచారణ జరపాలని కేసు వేశానన్నారు. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని కూడా కలుస్తానని ఆయన పేర్కొన్నారు.పవన్తో పాటూ పలువురు నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. పవన్ ఏమన్నా మాట్లాడితే తాట తీస్తా అంటాడన్నారు. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించానన్నారు. దొంగలే దొంగల్ని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయా అంటూ కేఏ పాల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. హైడ్రాపై రేవంత్ రెడ్డితో మాట్లాడానని కేఏ పాల్ తెలిపారు.
Read Also: Mynampally Hanumantha Rao: మైనంపల్లి ప్రాణత్యాగానికైనా సిద్ధం.. మీరు రెడీనా?
Also Read
- Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
- Veg Pulao Recipe: లంచ్ బాక్స్కు బెస్ట్ ఛాయిస్.. రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..
- Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
- Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
వాటికన్ సిటీని ప్రత్యేక దేశంగా చేసినప్పుడు.. లక్షల కోట్ల భక్తులు ఉన్న తిరుపతిని ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతం ఎందుకు చెయ్యకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు లా అండ్ ఆర్డర్ ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో హైడ్రాతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో తిరుమల వివాదంపై పిల్ వేశానన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడొద్దన్నారు. సిట్ విచారణ వేయడం ఏంటని.. సీబీఐ విచారణ జరగాలన్నారు. కల్తీ జరగలేదని.. రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. నేను భారతీయున్ని, క్రీస్తు ఫాలోవర్ ను.. ప్రపంచ శాంతిని కోరుకుంటున్నానన్నారు. హ్యుమానిటీ ముందు.. మతం తర్వాత అని అన్నారు. తిరుమల లడ్డు వివాదం దేశం దాటి, విదేశాల్లో చర్చ జరుగుతోందన్నారు.
తాజావార్తలు
-
Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
-
Akhil-Lenin: అదే పెద్ద ప్లస్ పాయింట్.. ఇక ‘లెనిన్’కు తిరుగులేదు!
-
Veg Pulao Recipe: లంచ్ బాక్స్కు బెస్ట్ ఛాయిస్.. రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..
-
Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
-
Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!