Arvind Kejriwal: రేపు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు..
- రేపు లిక్కర్ సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు
- కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరించినున్న ధర్మాసనం
- బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
- గతవారం కేజ్రీవాల్ పిటిషన్ పై సుదీర్ఘంగా సాగిన వాదనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లిక్కర్ సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు వెలువడనుంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం వెలువరించినుంది. కాగా.. ఇంతకుముందు ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. గతవారం కేజ్రీవాల్ పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు సాగాయి. ఇంకా ఏమైనా వాదనలు వినిపించాల్సి ఉంటే, లిఖిత పూర్వకంగా కోర్టుకు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో.. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. సిబీఐ తరపున ఎస్వీ రాజు (అడిషనల్ సొలిసిటర్ జనరల్) వాదనలు వినిపించారు. ఈ క్రమంలో.. ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. దీంతో.. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కాగా.. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కేజ్రీవాల్ జూన్ 26న అరెస్ట్ అయ్యారు.
Read Also: Nunakkhuzhi: తెలుగులోకి జయ జయహే హీరో సినిమా.. ఏ ఓటీటీలో ఎప్పటి నుంచి చూడాలంటే?
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ.. కేవలం వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్ను అరెస్టు చేశారని.. అరెస్టులను నియంత్రించడం కోసమే సీఆర్పీసీలో సెక్షన్ 41(ఏ)ను 2010లో చేర్చారని సింఘ్వీ తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం అరెస్టు చేయాల్సిన అవసరం ఉండదని.. ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణకు పిలిపించవచ్చని పేర్కొన్నారు. మరోవైపు.. కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధంగా జరిగిందని సీబీఐ తరుఫు న్యాయవాది తెలిపారు. కేజ్రీవాల్ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించలేదని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ కి సంబంధించి ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నామని.. ట్రయల్ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ద్వారా అరెస్ట్ కి గల కారణాలు తెలిపామని పేర్కొన్నారు. కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా చార్జ్ షీట్ దాఖలైందని సీబీఐ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని.. ఛార్జ్ షీట్ చూడకుండా, ట్రయల్ కోర్టు బెయిల్ పై విచారణ జరపకుండా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం సరికాదని అన్నారు. ఢిల్లీ కేసుకు పంజాబ్ లింక్ కూడా ఉంది.. ఇంకా విచారణ జరపాల్సి ఉందని సీబీఐ తరుఫు న్యాయవాది పేర్కొన్నారు.
Read Also: Raghu Thatha: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్ ‘రఘు తాత’.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!