Budget : అదానీ వ్యవహారంపై విపక్షాల ఆందోళన.. మధ్యాహ్నం 2 గంటలకు లోక్ సభ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఒక రోజు వాయిదా పడిన రాజ్యసభ, లోక్ సభలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే మరోసారి గౌతమ్ అదానీ- హిడెన్ బర్గ్ వ్యవహారంపై జేపీసీ ( జాయింట్ పార్లమెంటరీ కమిటీ ) విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. స్పీకర్ ఓంబిర్లా లోక్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. గత వారం లండన్ లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే మరోసారి లోక్ సభ సమావేశాలను వాయిదా పడ్డాయి.
Also Read : MLC Kavitha: ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. ఆ.. విషయంపై ప్రశ్నల వర్షం
Also Read
అదానీ-హిడెన్ బర్గ్ వ్యవహారంలో జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ విపక్షాల ఆందోళనల మధ్య లోక్ సభ స్పీకర్ నేటి సమావేశాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ 2023 మొదటి భాగం మాదిరిగానే సెకండ్ హాప్ లో కూడా అంతరాయాలతో ముందుకుసాగుతుంది. నిన్న కూడా అధికార-విపక్షాల మధ్య తీవ్ర నిరసనలు చేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. ఇవాళ్టీ సమావేశాల్లోనూ తమ డిమాండ్లను కొనసాగిస్తూ, ప్రతిపక్ష నాయకులు అదానీ వ్యవహారంపై వి వాంట్ జేపీసీ అంటూ నినాదాలు చేశారు. వెంటనే దీనిపై విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజ్యసభలో అదానీ-హిడెన్ బర్డ్ సమస్యపై చర్చను రాజ్యసభ ఛైర్మన్ తిరస్కరించారు. అంతకుముందు, పార్లమెంట్ లోని మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలతో ఆయన సమావేశం అయ్యారు సభాలో తమ గొంతుకలను వినిపించేందుకు వ్యూహాలు రూపొందించారు.
Also Read : Gudivada Amarnath:అవినీతిలో నోబెల్., నటనలో ఆస్కార్ చంద్రబాబుకే
లండన్ లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పరని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మాకు సమాధానం లభించే వరకు అదే డిమాండ్ ను పదేపదే అడుగుతామంటూ ఆయన పేర్కొన్నారు. ఇది సమస్య నుంచి పక్కదారి పట్టడం మాత్రమే.. మన రాయబార కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా.. ఈ దాడులను ఖండిస్తూ ఏమీ మాట్లాడటం లేదన్నారు. వీరు మెహుల్ చోక్సీకి రక్షణ కల్పించారని.. ఇప్పుడు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!