JP Nadda: కాంగ్రెస్పై జేపీ నడ్డా ఫైర్.. 2014కి ముందు చాలా స్కాంలు చేశారని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం అస్సాంలోని శివసాగర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. యూపీఏ పాలనపై మండిపడ్డారు. భారత దేశం 2014 ముందు ఎలా ఉంది.. 2014 తర్వాత ఎలా ఉంది. దేశంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయంటూ ఆయన అన్నారు. 2014కి ముందు భారతదేశం ఒక అవినీతి పీడిత దేశంగా ఉందని ఆరోపించారు. అంతేకాకుండా 2014కి ముందు కాంగ్రెస్ హయాంలో చాలా స్కాంలు జరిగినట్లు నడ్డా పేర్కొన్నారు.
Read Also: Groundwater Pumping: “భూమి భ్రమణ అక్షాన్ని” మారుస్తున్న భూగర్భ జలాల వినియోగం..
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. గత యుపిఎ హయాంలో “తాము భారతదేశానికి సంబంధించిన రెండు విభిన్న చిత్రాలను చూస్తున్నామన్నారు. గత 9 సంవత్సరాలకు ముందు ఒకటి ఆ తరువాత మరొకటని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేస్తూ, గత 9 సంవత్సరాలుగా ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారని నడ్డా అన్నారు.
Read Also: Virendra Sachdeva: మహిళల భద్రత పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం 800 కోట్ల కుంభకోణానికి పాల్పడింది
2014 నుండి ప్రధాని మోడీ నాయకత్వంలో ఒక బలమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉందన్నట్లు నడ్డా తెలిపారు. మోడీ ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్న ప్రభుత్వంగా నడ్డా అభివర్ణించారు. అంతేకాకుండా భారత్ను బలమైన దేశంగా మార్చేందుకు ప్రధాని కృషి చేశారని పేర్కొన్నారు. దేశానికి కొత్త శక్తిని, చైతన్యాన్ని నింపారు, దానిని ఆకాంక్షించేలా చేశారని నడ్డా తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పెద్ద పురోగతి సాధించింది” అని నడ్డా అన్నారు. ఈ రోజు భారతదేశం స్థాయి పెరుగుతున్నందున ప్రపంచ దేశాలు ఇండియాను గౌరవంగా చూస్తున్నారని తెలిపారు. 2014 నుంచి 2022 మధ్య కాలంలో కేవలం మౌలిక సదుపాయాల కోసమే రూ.18 లక్షల కోట్లు వెచ్చించామని.. దాంతో దేశాభివృద్ధికి ఊతమిచ్చినట్లు బీజేపీ జాతీయ చీఫ్ అన్నారు. ఈ ఏడాది మరిన్ని మౌలిక వసతుల కల్పనకు రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.
- Tags
- bjp
- congress
- modi
- Nadda
- national news
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!