Uttarpradesh : అత్తమామల ఇంట్లో బర్త్ డే పార్టీ… భార్య, కొడుకులను హత్య చేసి భర్త ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఓ భర్త తన అత్తమామల ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి భార్య, పిల్లల మృతదేహాలు కూడా అతని అత్తమామల ఇంటి నుంచి లభ్యమయ్యాయి. భర్త మొదట భార్య, బిడ్డను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురి మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల వారిని విచారించారు. భార్యాభర్తల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రాథమిక విచారణలో భార్య, బిడ్డను భర్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Also:Rains: బెంగళూరు, కేరళకు రెయిన్ అలర్ట్.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
మృతుడు నీలేష్కు నైనగర్కు చెందిన ప్రియాంకతో పదేళ్ల క్రితం వివాహమైంది. ప్రియాంక సోదరుడు టెంట్ హౌస్ నడుపుతున్నాడు. నీలేష్ టాక్సీ డ్రైవర్. టాక్సీ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత వారికి ఒక కొడుకు పుట్టాడు. వారి కొడుకు పుట్టిన తర్వాత ప్రియాంక, ఆమె భర్త మధ్య సంబంధం కొద్దిగా మెరుగుపడింది. కానీ తరువాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ప్రియాంక తన సోదరుడి కుమారుడి పుట్టినరోజు వేడుక కోసం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన తర్వాత నీలేష్ గురించి, అతని గొడవల గురించి చెప్పి అతడు తనను చాలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పింది. దీంతో మనస్తాపం చెంది నీలేష్ తన భార్య, కొడుకును హత్య చేసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బర్త్ డే వేడుకల సందర్భంగా కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also:T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్లో అమెరికా ఆల్టైమ్ రికార్డు.. టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు!
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?