Enforcement Directorate: ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Enforcement Directorate: రూ.538 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కోర్టులో హాజరుపరచగా సెప్టెంబర్ 11 వరకు రిమాండ్ విధించింది. కెనరా బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదు చేశారు.గోయల్ (74)ను ముంబైలోని తన కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద శుక్రవారం రాత్రి ఈడీ అరెస్టు చేసింది. శనివారం ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు.
Also Read: Ashok Gehlot: రాజస్థాన్ సీఎంకి ఆ రాష్ట్ర హైకోర్ట్ షోకాజ్ నోటీసులు
Also Read
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
కెనరా బ్యాంక్ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మేలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. రుణం మొత్తంలో కొంత భాగాన్ని సంబంధిత కంపెనీలకు కమీషన్గా మళ్లించడం ద్వారా జెట్ ఎయిర్వేస్ బ్యాంకును రూ. 538.62 కోట్లను మోసం చేసిందని బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొంది. కంపెనీ ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ లావాదేవీలు మోసపూరితమైనవని, రుణ మొత్తం నుంచి నిధులను మళ్లించడంలో పాల్గొన్నట్లు వెల్లడైంది. సీబీఐ తన ఎఫ్ఐఆర్లో గోయల్పై మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనపై ఆరోపణలు చేసింది. ఈ ఏడాది మేలో గోయల్ నివాసం, కార్యాలయాలు సహా ముంబైలోని ఏడు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది.
Also Read: Amit Shah: గిరిజనుల భూములపై కాంగ్రెస్ కన్ను పడింది
సంబంధిత కంపెనీలకు చెల్లించిన కమీషన్లుగా చూపబడిన జెట్ ఎయిర్వేస్ ఖర్చులలో కొంత భాగాన్ని వాస్తవానికి గోయల్ కుటుంబం, స్కామ్లో పాల్గొన్న ఇతర వ్యక్తుల వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. గోయల్, ఒక ప్రవాస భారతీయ వ్యాపారవేత్త, ఏప్రిల్ 1992లో జెట్ ఎయిర్వేస్ను స్థాపించారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎయిర్లైన్ 2019 ఏప్రిల్లో కార్యకలాపాలను నిలిపివేసింది. కంపెనీ ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉంది.
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!