Amit Shah: గిరిజనుల భూములపై కాంగ్రెస్ కన్ను పడింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతిని లక్ష్యం చేసుకుని ‘ఆరోప్ పత్ర’ పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ను ఉద్దేశించి రాహుల్ బాబాయ్ గిరిజనులకు ఏం చేశారో చెప్పాలని అమిత్ షా ప్రశ్నించారు. అంతే కాకుండా.. భూపేష్ బఘెల్ ప్రభుత్వం అవినీతిమయమైందని మండిపడ్డారు.
Polyhouse Rose Cultivation: పాలిహౌస్ గులాబి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
ఛత్తీస్గఢ్ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దామని గిరిజన సోదరులకు చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు. ఛత్తీస్గఢ్ను సుందరంగా తీర్చిదిద్దే పని రమణ్సింగ్ చేశారని.. 32 శాతం రిజర్వేషన్లు కల్పించారని రమణ్సింగ్ అన్నారు. ఆశలు, నమ్మకాలను వమ్ము చేసి.. రాష్ట్రంలోని కోట్లాది మంది కష్టాన్ని తమ ఢిల్లీ కోర్టులో నింపుకోవడానికి రాష్ట్రాన్ని అవినీతికి కోటగా మార్చారని దుయ్యబట్టారు. ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులను నిరోధించడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు.
India vs Pakistan LIVE Score, Asia Cup 2023: 100 దాటిన భారత్ స్కోరు.. 4 డౌన్
రాష్ట్రంలో రైతులు, గిరిజన సోదరులు, సోదరీమణులు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని అమిత్ షా తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోసం సిద్ధంగా ఉన్నారని హోంమంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి అవినీతిని, నల్ల కుబేరులను ప్రజల ముందుకు తీసుకువస్తామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతులకు 2 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చే పనిని బీజేపీ చేసిందని.. మాజీ సీఎం రమణ్సింగ్ ఇంటింటికీ బియ్యం పంపిణీ చేశారని తెలిపారు. బొగ్గు, మద్యం, ఆన్లైన్ బెట్టింగులతో కాంగ్రెస్.. రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందని కుంభకోణాలు, దౌర్జన్యాలు, పెట్రేగిపోతున్నాయని ఇక్కడ పరిస్థితి బాగుపడాలంటే అది ఒక్క బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని అమిత్ షా అన్నారు. గతంలో గిరిజనుల కోసం 24 వేల కోట్ల నిధులు ఉండేవని.. దానిని ప్రధాని మోడీ 1 లక్షా 19 వేల కోట్లకు పెంచారని అమిత్ షా చెప్పారు. ఇప్పుడు గిరిజనుల భూములపై కాంగ్రెస్ కన్ను పడిందని ఆరోపించారు.
Rahul Gandhi: బీజేపీ ఆదివాసీలను అటవీవాసులుగా పిలుస్తోంది
ఛత్తీస్గఢ్లో బాఘేల్ ప్రభుత్వం మొత్తం అవినీతి రికార్డులన్నిటినీ బద్దలుకొట్టేసిందని అమిత్ షా అన్నారు. బీజేపీ ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడ్డ పార్టీ ఒక్కరినీ తలకిందులుగా వేలాడదీసి గాడిలో పెడతామని అన్నారు. కేంద్రంలోనూ ఇక్కడా బీజేపీ ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే కేవలం రెండేళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!