ఎన్టీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీవీ పాడ్ క్యాస్ట్ షోలో తాజాగా మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ షోలో ఆయన అనేక విషయాలను ప్రేక్షకులలో పంచుకున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించడం అనేది ఇన్వెస్టిగేష్న్లో ఒక భాగమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు విశాఖ నుంచి పోటీ చేస్తానని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. రాబోయే ఎన్నికల్లో మూడురోజులు పోలింగ్ జరపాలని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెబ్ సైట్స్ లో పొందు పరచాలని సుప్రీమ్ తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు పోలింగ్ శాతాన్ని నియంత్రిస్తున్న విధానాన్ని జై భారత్ నేషనల్ పార్టీ అడ్డుకుంటుందని అన్నారు.
Vizag steel plant: విశాఖ ఉక్కు పోరాటం ఉధృతం అవుతోంది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సుదీర్ఘ పోరాటాలు సాగుతూనే ఉన్నాయి.. కార్మికుల పోరాటానికి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచియి.. ఇక, ఇవాళ విశాఖ ఉక్కుపోరాట కమిటీ మహాపాదయాత్ర నిర్వహించింది.. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం ఆలయం వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర ఉదయం 11 గంటలకు సింహాచంలో ముగిసింది.. తొలిపావంచ…
JD Lakshminarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ చెబుతూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ముందుకు వెళ్లడంలేదని ప్రకటించింది. అయితే, అంతకుముందే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల బృందం స్టీల్ ప్లాంట్లో పర్యటించడంతో.. ఆ ప్రకటన తర్వాత క్రెడిట్ గేమ్ నడిచింది.. మా పోరాటం వల్లే కేంద్రం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిందంటే.. లేదు మా వల్లే అంటూ అంతా హడావిడి స్టార్ట్ చేశారు.. ఈ నేపథ్యంలో.. స్టీల్ ప్లాంట్ విషయంలో…
రాష్ట్రంలో వీధి విక్రయదారులు బతుకుదెరువు, రక్షణ, క్రమబద్ధీకరణ చట్టంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ. తిరుపతి నగరంలోని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల సంఘం రక్షణ క్రమబద్ధీకరణ చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ. 2014 సంవత్సరంలో వీధి విక్రయదారులు జీవనోపాధి రక్షణ మరియు క్రమబద్దీకరణ చట్టం చేయబడింది. అయినా అనేక ప్రాంతాల్లో వీధి విక్రయదారులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్ ,మున్సిపాలిటీల ఉన్న…
ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం జాతీయ విద్యావిధానంపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాతృభాష ప్రాముఖ్యతపై మాట్లాడారు. భావ వ్యక్తీకరణకు మాతృభాషపై పట్టు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా సీబీఎస్ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీన్ని అమలు చేయాలంటే పాఠశాలల్లో కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఇందుకోసం సహకార వ్యవస్థలా మారాలి. ఈ విధానంలో వసతులు ఎక్కడ ఉన్నా వాటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది అని సూచించారు.…