JayaPrakash Narayana: ఏపీలో రెడ్లకు కమ్మ- కాపుల మధ్య పోరాటం.. రాష్ట్రాన్ని కులాల క్షేత్రంగా మార్చకండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఒకవైపు టీడీపీ- జనసేన- బీజేపీ మరోవైపు పోటీ పడుతున్నాయని లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఏపీలో రెడ్లకు కమ్మ – కాపుల మధ్య పోరాటం అనే చర్చ జరుగుతోంది.. మంచి పాలన అంటే కేవలం సంక్షేమం అని ఒక పార్టీ భావిస్తోంది.. అప్పులు తెచ్చి సగం జీత భత్యాలకు, మరికొంత కైంకర్యం చేసి, కొంత దుబారా చేసి, మిగిలాగా సంక్షేమానికి పెడుతున్నారు అని ఆయన ఆరోపించారు. దేశ సమాజంలో సంక్షేమం అవసరమే కానీ.. దానికి పరిమితం ఉండాలి కదా అని ప్రశ్నించారు. కేవలం సంక్షేమమే పరిపాలన అనుకుంటే.. ఆ దేశం, రాష్ట్రం నాశనం అవ్వడం ఖాయం అన్నారు. మనకి ఇప్పుడు నడుస్తుంటే కాదు.. మన పిల్లల భవిష్యత్ ఏంటి అని అందరూ ఆలోచించాలి అని జయప్రకాశ్ నారాయణ చెప్పారు.
Read Also: PM Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్కి ప్రధాని మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
Also Read
సంక్షేమం అంటేనే.. వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలు అని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ది పైనే ప్రధానంగా పోరాటం సాగుతుంది.. భవిష్యత్ తరాలకు మంచి చేసేవారు, ఉపాధి అవకాశాలు చూపే వారికే పట్టం కట్టండి అని పిలుపునిచ్చారు. ఏపీని కులాల క్షేత్రంగా మార్చకండని మొత్తుకుంటున్నా.. ఎవరూ వినడం లేదు అని పేర్కొన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ లో తన మద్దతు ఎన్డీఏ కూటమికేనని తెలిపారు. ఇక, రేపటి నుంచి తనపై కులముద్ర వేస్తారని తెలుసు.. అయినా రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వ్యాఖ్యనించారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!