Team India: టీమిండియాకు మరో షాక్.. కీలక బౌలర్కు గాయం..!
- భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు గాయం
- గాయం ఎంత తీవ్రంగా ఉందనే దానిపై స్పష్టత లేదు
- బుమ్రా వేలికి గాయమైనప్పటికీ.. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత బౌలింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్తో శుక్రవారం జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. అయితే.. అతనికి గాయం ఎంత తీవ్రంగా ఉందనే దానిపై బీసీసీఐ అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పటికే.. మోకాలి గాయం కారణంగా రిషబ్ పంత్ ఆటకు దూరంగా ఉండటంతో టీమ్ మేనేజ్మెంట్లో ఆందోళన పెరిగింది. బుమ్రా వేలికి గాయమైనప్పటికీ.. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత బుమ్రా బౌలింగ్ చేశాడు. వేలి నుంచి రక్తం వచ్చినా.. చికిత్స అనంతరం బౌలింగ్ చేశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 86వ ఓవర్లో లంచ్ తర్వాత ఫిజియో మైదానంలో కనిపించాడు. ఆ తర్వాత భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కామెంట్రీ సమయంలో ఫాస్ట్ బౌలర్ మధ్య వేలు కోసుకుపోయి రక్తస్రావం అవుతుందని చెప్పాడు. నొప్పితోనే బుమ్రా ఆ ఓవర్ పూర్తి చేశాడు. మళ్లీ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు అతని వేలికి టేప్తో కనిపించింది.
Read Also: TG Government : 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన తెలంగాణ సర్కార్
Also Read
తొలి టెస్టు మ్యాచ్లో మూడో రోజైన శుక్రవారం న్యూజిలాండ్తో రెండో ఇన్నింగ్స్లో ప్రస్తుతం భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (35), రోహిత్ శర్మ (52) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (19), సర్ఫరాజ్ ఖాన్ (13) పరుగులతో ఉన్నారు. 26 ఓవర్లలో 121/2 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 356 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 402 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!