ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో, అంతే స్థాయిలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై నెగిటివిటీ కూడా పెరిగిపోయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. తన సోదరుడు అర్జున్ కపూర్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన ట్రోలింగ్కు గురవుతున్న నేపథ్యంలో, జాన్వీ ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Also Read : NBK111: బాలకృష్ణ-గోపీచంద్ మలినేనిమూవీలో.. మంచు హీరో సెన్సేషనల్ ఎంట్రీ!
జాన్వీ మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో వైరల్ అవ్వాలని అనుకుంటుంన్నారు. ఈ క్రమంలో వారు సెలబ్రిటీల గురించి కంటెంట్ను సృష్టిస్తున్నారు, కేవలం వారి వ్యూస్ కోసం మమ్మల్ని ‘బలిపశువు’ చేస్తున్నారు. మా పేరును వాడుకుని కేవలం క్లిక్స్ వ్యూస్ పొందాలనుకుంటారు తప్ప, అందులో నిజం ఎంత ఉందో అనవసరం. అసలు ఆ వార్తలకు మాకు ఎలాంటి సంబంధం లేదని తెలిసినా కూడా వారు కావాలనే నెగిటివిటీని ప్రచారం చేస్తారు’ అని ఆమె పేర్కొన్నారు. అలాగే
తన సోదరుడు అర్జున్ కపూర్పై వస్తున్న అభ్యంతరకరమైన కామెంట్స్ గురించి మాట్లాడుతూ.. ‘మనుషులు మన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో జరిగే ఈ రకమైన వేధింపులను అస్సలు క్షమించాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని మనం మనసుకి దగ్గరగా తీసుకోకూడదు. వాటి గురించి ఆలోచిస్తూ ఎక్కువ సమయం వృధా చేయడం కంటే, ఆ నెగిటివిటీకి మనల్ని మనం ఎంత దూరంగా ఉంచుకుంటే అంత మేలు’ అని జాన్వీ హితవు పలికారు. ప్రజంట్ జాన్వీ మాటలు వైరల్ అవుతున్నాయి.