Palla Rajeshwar Reddy : దేవాదుల గురించి ఏం చేయని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం…
- జనగామలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్.. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు
- దేవాదుల ప్రాజెక్టు అభివృద్ధి.. కేసీఆర్ కృషి vs కాంగ్రెస్ వైఫల్యం
- స్టేషన్ఘన్పూర్ ప్రజలు ఉప ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palla Rajeshwar Reddy : జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రాజెక్టును పూర్తిచేసి, ఫేజ్ 3లో మూడు మోటర్లతో 1800 క్యూసెక్కుల నీటి సరఫరా కోసం ఏర్పాట్లు చేసింది కేసీఆర్ ప్రభుత్వం” అని తెలిపారు. అయితే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ, “ఆరు నియోజకవర్గాలకు నీరందించే దేవాదుల లోయర్ డ్యామ్కు కేవలం 6 కోట్లు కేటాయించలేని కాంగ్రెస్ ప్రభుత్వం అజ్ఞానపు పాలకుల చేతిలో ఉంది” అంటూ విమర్శలు చేశారు.
చలివాగు వద్ద ఉద్యోగులు 30 రోజులు సమ్మె చేసి మోటర్లు బంద్ చేస్తే, రైతులకు నీరు ఇవ్వలేని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. “నేను ఇరిగేషన్ అధికారులతో, సెక్రటేరియట్ అధికారులతో, ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి 6 కోట్ల రూపాయలు మంజూరు చేయించాను. కానీ కడియం శ్రీహరి మాత్రం స్టైల్గా మేమే నీరందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు” అని వ్యాఖ్యానించారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
“గండిరామరం రిజర్వాయర్ నుండి స్టేషన్ఘన్పూర్లో ఒక్క ఎకరానికి కూడా నీరు పారదు. కడియం శ్రీహరి డ్రామా చేయడానికి మాత్రమే రిజర్వాయర్ వద్దకు వచ్చారు” అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. “తాను సీనియర్ అని, దేవాదుల ప్రాజెక్టు తాను తెచ్చానని చెప్పుకునే కడియం, మేమేసిన ఓటుతో గెలిచి ఇప్పుడు రాజకీయ నాటకాలు ఆడుతున్నారు” అని మండిపడ్డారు. “స్టేషన్ఘన్పూర్ ప్రజలు ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు” అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
ఈ నెల 27న జరగబోయే బహిరంగ సభ గురించి ప్రస్తావిస్తూ, “ఈ సభ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఐదవ మహాసభగా నిలవబోతుంది. జనగామ జిల్లా నుంచి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలి” అని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!