Janasena Leader Attacked: జనసేన నేతపై కట్టెలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి..!
Janasena Leader Attacked: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జనసేన పార్టీ నాయకుడిపై దాడి జరిగింది.. ఆ పార్టీ నేత కోటిరెడ్డి రాజారెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారు.. జనసేన పార్టీ వ్యక్తిగత కార్యాలయం వద్ద పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న రాజారెడ్డి దగ్గరకు వచ్చిన కొందరు యువకులు.. ఆయనతో మొదట ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు.. ఆ తర్వాత చుట్టుముట్టి దాడిక పాల్పడ్డారు.. కట్టెలతో.. రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో కోటిరెడ్డి రాజారెడ్డి తీవ్ర గాయాలపాలైనట్టుగా తెలుస్తోంది..
Read Also: Bigg Boss 7 Telugu : ఈ వారం కూడా అమ్మాయినే ఎలిమినేట్.. ఎవరో తెలిసిపోయింది..?
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఇక, ఆ తర్వాత స్థానికులు రాజారెడ్డిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజారెడ్డిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పరామర్శించారు.. అయితే, తనపై దాడి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారేనని.. కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో దాదాపు 10 మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి తనపై దాడి చేశారని చెబుతున్నారు రాజారెడ్డి. మరోవైపు.. వైసీపీ కార్యకర్తల దాడిపై తీవ్రంగా మండిపడ్డారు జనసేన పీఏసీ సభ్యుడు, ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. ఎమ్మెల్యే అండతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.. ఇక, రాజారెడ్డిపై దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.. ఆ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో