Janasena Leaders Joins YSRCP: జనసేనకు షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Leaders Joins YSRCP: ఏపీలో జనసేన పార్టీకి మరో బిగ్షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జనసేనకు చెందిన పలువురు కీలక నేతలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ వైసీపీలో చేరారు. రామ్సుధీర్తో పాటు జనసేన స్ధానిక నాయకులు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాద్లు వైసీపీలో చేరారు. కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు.
Read Also: Ap Jobs 2023 : నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో 70 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. వివరాలివే..
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
- Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
జనసేన విధానాలు నచ్చక ఎడ్లపల్లి రాం సుధీర్ వైసీపీలో చేరారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. జగన్ పాలన మెచ్చి కలసి పని చేయాలని పార్టీలో చేరారని.. ఎన్నికల నాటికి చంద్రబాబుతో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒక్కరేనన్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని.. చంద్రబాబుకు తాబేదారుగా ఉంటూ మోస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని చంద్రబాబుకు మద్దతు ఇవ్వొద్దని జనసేన నేతలను కోరుతున్నామని మంత్రి జోగి రమేష్ అన్నారు. రాబోయే రోజుల్లో మంచి జరగాలంటే జగన్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. రేపట్నుంచి ఇంకా చాలా మంది జనసేన నుంచి వైసీపీలో చేరబోతున్నారని ఆయన చెప్పారు. అందరికీ వైసీపీ ఆహ్వానం పలుకుతుందన్నారు.
Read Also: Breaking: రాష్ట్రాలకు కేంద్రం కొవిడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
టీడీపీతో జనసేన ముసుగు రాజకీయాలు చేస్తోందని వైసీపీలో చేరిన ఎడ్లపల్లి రాంసుధీర్ చెప్పారు. పవన్ నాయకత్వాన్ని బలపరిచేందుకు మేమంతా పని చేశామని.. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచారన్నారు. పార్టీలో ఉంటే ఉండండి.. లేదంటే లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారని.. పని చేసినందుకు మాపై కోవర్టు ముద్ర వేశారన్నారు. పవన్ కళ్యాణ్ను ముసుగు రాజకీయాలు చేయవద్దని కోరుతున్నామని ఆయన అన్నారు. పని చేసే కార్యకర్తలను, నాయకులను పవన్ కళ్యాణ్ కాపాడుకోవాలన్నారు. పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అని పవన్ మాట్లాడటం సరికాదన్నారు. జగన్ సంక్షేమ పాలన నచ్చి వైసీపీలో చేరానని ఎడ్లపల్లి రాంసుధీర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
-
Pat Cummins: ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లు నటించా.. పంజాబ్ స్టార్ ప్లేయర్ ఈజీగా బుట్టలో పడ్డాడు!
-
Vijay’s Convoy Security Withdrawn: విజయ్ కి షాక్ భద్రత తొలగింపు.. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ
-
Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!