Janasena Leaders Joins YSRCP: జనసేనకు షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Leaders Joins YSRCP: ఏపీలో జనసేన పార్టీకి మరో బిగ్షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జనసేనకు చెందిన పలువురు కీలక నేతలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ వైసీపీలో చేరారు. రామ్సుధీర్తో పాటు జనసేన స్ధానిక నాయకులు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాద్లు వైసీపీలో చేరారు. కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు.
Read Also: Ap Jobs 2023 : నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో 70 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. వివరాలివే..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
- Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
జనసేన విధానాలు నచ్చక ఎడ్లపల్లి రాం సుధీర్ వైసీపీలో చేరారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. జగన్ పాలన మెచ్చి కలసి పని చేయాలని పార్టీలో చేరారని.. ఎన్నికల నాటికి చంద్రబాబుతో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒక్కరేనన్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని.. చంద్రబాబుకు తాబేదారుగా ఉంటూ మోస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని చంద్రబాబుకు మద్దతు ఇవ్వొద్దని జనసేన నేతలను కోరుతున్నామని మంత్రి జోగి రమేష్ అన్నారు. రాబోయే రోజుల్లో మంచి జరగాలంటే జగన్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. రేపట్నుంచి ఇంకా చాలా మంది జనసేన నుంచి వైసీపీలో చేరబోతున్నారని ఆయన చెప్పారు. అందరికీ వైసీపీ ఆహ్వానం పలుకుతుందన్నారు.
Read Also: Breaking: రాష్ట్రాలకు కేంద్రం కొవిడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
టీడీపీతో జనసేన ముసుగు రాజకీయాలు చేస్తోందని వైసీపీలో చేరిన ఎడ్లపల్లి రాంసుధీర్ చెప్పారు. పవన్ నాయకత్వాన్ని బలపరిచేందుకు మేమంతా పని చేశామని.. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచారన్నారు. పార్టీలో ఉంటే ఉండండి.. లేదంటే లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారని.. పని చేసినందుకు మాపై కోవర్టు ముద్ర వేశారన్నారు. పవన్ కళ్యాణ్ను ముసుగు రాజకీయాలు చేయవద్దని కోరుతున్నామని ఆయన అన్నారు. పని చేసే కార్యకర్తలను, నాయకులను పవన్ కళ్యాణ్ కాపాడుకోవాలన్నారు. పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అని పవన్ మాట్లాడటం సరికాదన్నారు. జగన్ సంక్షేమ పాలన నచ్చి వైసీపీలో చేరానని ఎడ్లపల్లి రాంసుధీర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
-
Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
-
Saif Ali Khan: బట్టలు లేకుండా నటించమన్నారు… 20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!