Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Janasena Leader Nadendla Manohar Fires On Ap Govt Over Pala Velluva Scheme

Nadendla Manohar: పథకాలు నిజాయితీగా ప్రజలకు అందాలనేదే మా పోరాటం

Published Date :November 11, 2023 , 3:54 pm
By Mahesh Jakki
Nadendla Manohar: పథకాలు నిజాయితీగా ప్రజలకు అందాలనేదే మా పోరాటం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nadendla Manohar: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ స్పష్టమైన ప్రశ్నలతో ముందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎదురు దాడి చేస్తుందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పథకాలు నిజాయితీగా నేరుగా అంతిమంగా ప్రజలకు అందాలనేదే తమ పోరాటమని తెలిపారు. పాలవెల్లువ పథకం పాపాల వెల్లువ అని.. పాలవెల్లువ పథకంలో స్కామ్ జరిగిందని చెబితే మంత్రి స్పందించడానికి ఈన్ని రోజులు పట్టిందా అంటూ ఆయన ప్రశ్నించారు. కోట్లు పెట్టి పథకాలు తెచ్చినప్పుడు రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదని నాదెండ్ల ప్రశ్నించారు.

పాలవెల్లువ పథకం వైసీపీ నాయకుల కోసం అమూల్ డైరీ కోసమే కోసమే బటన్ నొక్కారని ఆయన ఆరోపించారు. పథకంలో వేల కోట్లు అవినీతి జరిగింది.. ఆ డబ్బులు అన్ని ఎటుపోయాయో సమాధానం చెప్పాలన్నారు. మీ శాఖ మీద జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడాలన్నారు. ఈ మంత్రి మీదే మరో అంబులెన్స్ స్కాం బయట పెడతామని దానికి కూడా సిద్దంగా ఉండాలన్నారు. మీ శాఖ ద్వారా ప్రభుత్వం డబ్బులు నష్టం జరుగుతుంటే మీకు బాధ లేదా అంటూ వ్యాఖ్యానించారు. మేము సిద్దంగా ఉన్నామన్న ఆయన.. మండల, గ్రామాల, ద్వారా లిస్ట్ ఇవ్వండి.. ఎక్కడికి కావాలి అంటే అక్కడికి వెళ్దామని, మా జనసేన శ్రేణులు కూడా వస్తారు మీలో నిజాయితీ ఉంటే రావాలని ఆయన సవాల్ విసిరారు. ప్రభుత్వం చేస్తున్న స్కాంలను ఆధారాలతో సహా బయటపెడతామని.. వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నారు.

Also Read: Liquor on Road: మద్యం లారీ బోల్తా.. మందుబాటిళ్ల కోసం ఎగబడ్డ మందుబాబులు

పశువుల కొనుగోలు విషయంలో ఒక మంత్రి 2,08,790 పశువులు కొనుగోలు చేసామని చెప్తే, మరో మంత్రి 3, 94,000 పశువులు కొనుగోలు చేయడం జరిగిందని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. సాక్షాత్తు శాసనసభలో 3,92, 911 పశువులు కొనుగోలు చేయడం జరిగిందని మరో అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. క్లాస్ వార్ అని ప్రగల్బాలు పలికే ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి స్కామ్ గురించి ఎండగడుతూ స్పష్టమైన ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు న్యాయం చేయడమే జనసేన లక్ష్యమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాడి పరిశ్రమ పట్ల మంత్రులు తమకు తోచిన విధంగా వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. అధికారులు చెప్పిన లెక్కలకు మంత్రులు చెప్పే లెక్కలకు పొంతన లేదన్నారు. పాడి పరిశ్రమ ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సహిస్తున్నామని, ప్రగల్బాలు పలికే రాష్ట్ర ప్రభుత్వం వారిని నమ్మించి మోసం చేశారన్నారు. అమూల్‌కి 22 లక్షల లీటర్లు అందిస్తామని గతంలో ఒక మంత్రి చెబితే నేడు మరో మంత్రి అమూల్ కోసం రెండు లక్షల 75 వేల పాల సేకరణ జరుగుతుందని చెప్పడం విడ్డూరమన్నారు.

Also Read: Mangalavaaram : షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన అజయ్ భూపతి…

శాఖలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడకుండా మరో విషయం గురించి మాట్లాడుతూ అసలు అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారన్నారన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాంలో నాలుగేళ్లలో గుజరాత్ హర్యానా నుండి పశువులు కొనుగోలుకి అనుమతులు ఇచ్చిన 50,000 దాటని పరిస్థితి ఉందని ఆయనఅన్నారు. క్షేత్రస్థాయిలో పశువులు 8000 మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్తుంటే వాటి పట్ల మంత్రులు సమాధానం ఇవ్వాలన్నారు. నవంబర్ 14 నుండి ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి స్కాం గురించి జనసేన బయటపెట్టడం ఖాయమని దానికి సిద్దంగా ఉండాలని డిమాండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • janasena
  • nadendla manohar
  • Pala Velluva Scheme
  • Telugu News AP Govt

తాజావార్తలు

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • KING : వెయ్యి కోట్లు వసూళ్లపై కన్నేసిన స్టార్ హీరో

  • ICC T20 World Cup 2026 Team: భారత్‌ నుంచి నలుగురికి చోటు.. సూర్యకు షాక్, ఐసీసీ వరల్డ్ కప్‌ టీమ్‌కు కెప్టెన్ ఎవరంటే?

  • Mamidalapalli: మరణంలోనూ విడతీయని బంధం.. భర్త మరణించాడని భార్య కూడా..!

  • Parthiban vs Trisha Controversy : త్రిషా ఆరోపణలపై తమిళ నటుడు పార్థిబన్ ఆగ్రహం..

ట్రెండింగ్‌

  • India Performance: బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు.. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ ప్లేయర్స్ ఇండివిజువల్ పెర్ఫామెన్స్ ఇదే!

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions