Nagababu: అన్నీ సర్దుకున్నాయి.. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu: అన్నీ సర్దుకున్నాయి.. తిరుపతిలో భారీ మెజారిటీతో జనసేన పార్టీ అభ్యర్థి గెలవగెలవబోతుందన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి తిరుపతి వచ్చిన ఆయన.. అసంతృప్త నేతలతో జరిపిన చర్చల్లో పాల్గొన్నారు.. శుక్రవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి.. అంతా కలిసి కట్టుగా పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఈ రోజు నాగబాబు మాట్లాడుతూ.. కూటమి నేతలు అందరూ ఏకతాటిపైకి వచ్చారు.. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి.. అందుకే పవన్ కల్యాణ్ తిరుపతి వచ్చారని తెలిపారు.. కూటమి నేతలతో మాట్లాడాం. అన్నీ సర్థుకున్నాయి.. తిరుపతి లో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలవబోతున్నారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు.
Read Also: Kavitha: కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. వాట్సప్ చాట్పై ప్రశ్నించే ఛాన్స్
Also Read
కాగా, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్, జనసేన నేతలు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.. అభ్యర్థిని మార్చాలంటూ ఆందోళనకు దిగారు.. బహిరంగంగా పార్టీపై సంచనల వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ, జనసేన అధిష్టానం నుంచి వారిని సముదాయించే ప్రయత్నాలు జరిగాయి.. దీంతో, కొంత సైలెంట్ అయినా.. వారిలో అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది.. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనతో అంతా ఒక్కతాటిపైకి వచ్చేశారు. శుక్రవారం రోజు తిరుపతి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అర్ధరాత్రి వరుకు తిరుపతిలో కూటమీ పార్టీల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించారు.. తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలని పిలుపునిచ్చిన ఆయన.. జనసేన, టీడీపీ సమన్వయంతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని సూచించారు. ఏ ఒక్క నాయకుడు.. కార్యకర్త త్యాగాన్నీ, కష్టాన్నీ మరచిపోం.. వచ్చేది కూటమి ప్రభుత్వమే.. నాయకులు, కార్యకర్తల బాధ్యతను సమష్టిగా తీసుకుంటాం అనే పార్టీ నేతలకు భరోసా కల్పించారు పవన్ కల్యాణ్. ఇక, ఆరణి శ్రీనివాసులు గెలుపుకోసం అంతా కృషి చేస్తామని ప్రకటించిన సంగతి విదితమే.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!