Jaish-e-Mohammed: మళ్లీ పుంజుకుంటున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaish-e-Mohammed: పాకిస్థాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మళ్లీ చురుగ్గా మారుతోంది. పహల్గామ్ దాడి తర్వాత.. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్థాన్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా జైషే మహ్మద్ ఈ ప్రధాన కార్యాలయాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ దీని కోసం ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించాడు. విరాళాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. పాకిస్థాన్లోని దక్షిణ పంజాబ్ ప్రావిన్స్ కి 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్ చాలా కాలంగా ఉగ్రవాద సంస్థ సైద్ధాంతిక, శిక్షణ కేంద్రంగా ఉంది.
READ MORE: CM Chandrababu: మంత్రులకు సీఎం దిశానిర్దేశం.. ఇక నుంచి దూకుడు పెంచాలి..!
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
అయితే.. సోషల్ మీడియాలో ఉర్దూలో షేర్ చేయబడిన ఒక పోస్ట్ ప్రకారం.. జెఎం తన ప్రధాన కార్యాలయం – జామియా మసీదు సుభాన్ అల్లాహ్ పునరుద్ధరణ కోసం తెలివిగా విరాళాలను కోరింది. “అందరూ ఐక్యంగా, కలిసి పనిచేయాలి. అలాగే, డబ్బు వసూలు చేసేటప్పుడు, ఎవరు ఎంత విరాళం ఇచ్చారో ఎవరికీ వెల్లడించకూడదని గుర్తుంచుకోండి. ఈ ప్రచారం ద్వారా భూమిపై కొన్ని ప్రాంతాలు స్వర్గంలా మారుతాయి. అమరవీరుల మసీదులకు వైభవం తిరిగి వస్తుంది. జిహాద్ మార్గాన్ని అనుసరించడానికి ఆసక్తి ఉన్న వాళ్లకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.” అని పేర్కొన్నారు.
READ MORE: Singireddy Niranjan Reddy : కమిషన్లు కోర్టులు కావు.. నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత భద్రతా దళాలు తమ బలాన్ని ప్రదర్శించి ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడిలో జైషే మహ్మద్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. సైన్యం బహవల్పూర్లోని జైష్-ఎ-మహ్మద్ ప్రధాన కార్యాలయం అయిన సుభాన్ అల్లాహ్ మసీదును భారత సైన్యం కూల్చివేసింది. ఈ వైమానిక దాడిలో ఉగ్రవాదులకు శిక్షణ అందించే స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఆపరేషన్లో మసూద్ అజార్ కుటుంబంతో సహా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!