Jagga Reddy : అధికారంలో ఉన్నా… లేకపోయినా నేను బలమైన వ్యక్తిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలో ఉన్నా… లేకపోయినా తాను బలమైన వ్యక్తిని అని వ్యాఖ్యానించారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్లో ఇవాళ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ పాత్రికేయులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ…… ఐదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు.. మంత్రులూ అలాగే ఉంటారని… ఇందులో ఎలాంటి అనుమానం లేదని జగ్గారెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా… తాము మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మా వ్యూహాలు మాకు ఉన్నాయని ఆయన తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ గేమ్స్ ఆడే ప్రయత్నం చేస్తున్నాయని… కానీ మా గేమ్స్ ముందు వారు ఎంత? అన్నారు జగ్గారెడ్డి.
తన టైమ్ బాగాలేదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో ఓడిపోయానన్నారు. రాజకీయ నాయకుడు అంటే ఓసారి గెలవవచ్చు… మరోసారి ఓడిపోవచ్చునన్నారు. అయితే అధికారంలో ఉన్నా.. ఎమ్మెల్యేగా గెలవకపోయినా అధికార కార్యక్రమానికి తనను పిలవాలని తాను చెప్పడం వెనుక ఇది కేసీఆర్ నేర్పిన విద్యయే అన్నారు. తాను మరో 40 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటానన్నారు జగ్గారెడ్డి.
Also Read
- AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
- BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
- IND vs SL: భారత్ స్పిన్ ఉచ్చులో పడ్డ శ్రీలంక బ్యాటర్స్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే.?
- MLC Nagababu: ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ ర్యాంక్.. కీలక పదవిలో నియామకం!
తాను గతంలో హరీశ్ రావుతో రాజకీయంగా పోరాడానని… అదే సమయంలో అభివృద్ధి కోసం ఆయనను కలిశానన్నారు. రాజకీయం వేరు… అభివృద్ధి వేరు అన్నారు. హరీశ్ రావు తనను రాజకీయంగా తొక్కేయాలని చూశారని ఆరోపించారు. వ్యతిరేకత వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుందని తెలిపారు. తాము కలిసికట్టుగా పనిచేసి మెదక్ లోక్ సభ స్థానాన్ని గెలుచుకుంటామని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే బీజేపీ, బీఆర్ఎస్ కోరిక ఫెయిల్ అవుతుందని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా తొలగించాలని తాను డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని… కానీ అది ముగిసిపోయిన ఎపిసోడ్ అన్నారు. తాను కాంగ్రెస్ లైన్లో వెళతానన్నారు. తాను రేవంత్ రెడ్డిపై మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ తనకు ఓ మాట చెప్పారని… మనం అధికారంలోకి రాబోతున్నాం… ఎవరినీ ఏమీ అనవద్దని సూచించారని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తను కాబట్టి మా పార్టీ నేత చెప్పింది విన్నానన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ బీజేపీలో ఉండదన్నారు.
ఆనాటి నుంచి తాను రేవంత్ రెడ్డిని ఏమీ అనలేదని తెలిపారు. అయినా అది మా కాంగ్రెస్ ఇంటి పంచాయతీ అని పేర్కొన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి హామీలు అమలు చేస్తూ మంచి పాలన అందిస్తామన్నారు. మా పార్టీలో మేం కొట్టుకుంటాం… తిట్టుకుంటాం… మా పైకి ఎవరైనా వస్తే మేమంతా కలిసి తిరగబడతామన్నారు. ఇదే కాంగ్రెస్ పద్ధతి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్లోకి ‘హుషార్ పిట్టలు’.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
-
Allari Naresh : కామెడీ స్టార్ ‘అల్లరి నరేశ్’ ఈసారైనా నవ్విస్తాడా?
-
Marathi Test: మహారాష్ట్రలో 7,750 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మరాఠీ పరీక్షలో ఫెయిల్.. ఇక లైసెన్స్ పరిస్థితి ఏంటి?
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
ట్రెండింగ్
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..