Jagga Reddy : అధికారంలో ఉన్నా… లేకపోయినా నేను బలమైన వ్యక్తిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలో ఉన్నా… లేకపోయినా తాను బలమైన వ్యక్తిని అని వ్యాఖ్యానించారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్లో ఇవాళ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ పాత్రికేయులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ…… ఐదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు.. మంత్రులూ అలాగే ఉంటారని… ఇందులో ఎలాంటి అనుమానం లేదని జగ్గారెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా… తాము మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మా వ్యూహాలు మాకు ఉన్నాయని ఆయన తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ గేమ్స్ ఆడే ప్రయత్నం చేస్తున్నాయని… కానీ మా గేమ్స్ ముందు వారు ఎంత? అన్నారు జగ్గారెడ్డి.
తన టైమ్ బాగాలేదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో ఓడిపోయానన్నారు. రాజకీయ నాయకుడు అంటే ఓసారి గెలవవచ్చు… మరోసారి ఓడిపోవచ్చునన్నారు. అయితే అధికారంలో ఉన్నా.. ఎమ్మెల్యేగా గెలవకపోయినా అధికార కార్యక్రమానికి తనను పిలవాలని తాను చెప్పడం వెనుక ఇది కేసీఆర్ నేర్పిన విద్యయే అన్నారు. తాను మరో 40 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటానన్నారు జగ్గారెడ్డి.
Also Read
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
- Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
తాను గతంలో హరీశ్ రావుతో రాజకీయంగా పోరాడానని… అదే సమయంలో అభివృద్ధి కోసం ఆయనను కలిశానన్నారు. రాజకీయం వేరు… అభివృద్ధి వేరు అన్నారు. హరీశ్ రావు తనను రాజకీయంగా తొక్కేయాలని చూశారని ఆరోపించారు. వ్యతిరేకత వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుందని తెలిపారు. తాము కలిసికట్టుగా పనిచేసి మెదక్ లోక్ సభ స్థానాన్ని గెలుచుకుంటామని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే బీజేపీ, బీఆర్ఎస్ కోరిక ఫెయిల్ అవుతుందని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా తొలగించాలని తాను డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని… కానీ అది ముగిసిపోయిన ఎపిసోడ్ అన్నారు. తాను కాంగ్రెస్ లైన్లో వెళతానన్నారు. తాను రేవంత్ రెడ్డిపై మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ తనకు ఓ మాట చెప్పారని… మనం అధికారంలోకి రాబోతున్నాం… ఎవరినీ ఏమీ అనవద్దని సూచించారని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తను కాబట్టి మా పార్టీ నేత చెప్పింది విన్నానన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ బీజేపీలో ఉండదన్నారు.
ఆనాటి నుంచి తాను రేవంత్ రెడ్డిని ఏమీ అనలేదని తెలిపారు. అయినా అది మా కాంగ్రెస్ ఇంటి పంచాయతీ అని పేర్కొన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి హామీలు అమలు చేస్తూ మంచి పాలన అందిస్తామన్నారు. మా పార్టీలో మేం కొట్టుకుంటాం… తిట్టుకుంటాం… మా పైకి ఎవరైనా వస్తే మేమంతా కలిసి తిరగబడతామన్నారు. ఇదే కాంగ్రెస్ పద్ధతి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!