Jagga Reddy : అధికారంలో ఉన్నా… లేకపోయినా నేను బలమైన వ్యక్తిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలో ఉన్నా… లేకపోయినా తాను బలమైన వ్యక్తిని అని వ్యాఖ్యానించారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్లో ఇవాళ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ పాత్రికేయులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ…… ఐదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు.. మంత్రులూ అలాగే ఉంటారని… ఇందులో ఎలాంటి అనుమానం లేదని జగ్గారెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా… తాము మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మా వ్యూహాలు మాకు ఉన్నాయని ఆయన తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ గేమ్స్ ఆడే ప్రయత్నం చేస్తున్నాయని… కానీ మా గేమ్స్ ముందు వారు ఎంత? అన్నారు జగ్గారెడ్డి.
తన టైమ్ బాగాలేదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో ఓడిపోయానన్నారు. రాజకీయ నాయకుడు అంటే ఓసారి గెలవవచ్చు… మరోసారి ఓడిపోవచ్చునన్నారు. అయితే అధికారంలో ఉన్నా.. ఎమ్మెల్యేగా గెలవకపోయినా అధికార కార్యక్రమానికి తనను పిలవాలని తాను చెప్పడం వెనుక ఇది కేసీఆర్ నేర్పిన విద్యయే అన్నారు. తాను మరో 40 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటానన్నారు జగ్గారెడ్డి.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
- Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
- Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
తాను గతంలో హరీశ్ రావుతో రాజకీయంగా పోరాడానని… అదే సమయంలో అభివృద్ధి కోసం ఆయనను కలిశానన్నారు. రాజకీయం వేరు… అభివృద్ధి వేరు అన్నారు. హరీశ్ రావు తనను రాజకీయంగా తొక్కేయాలని చూశారని ఆరోపించారు. వ్యతిరేకత వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుందని తెలిపారు. తాము కలిసికట్టుగా పనిచేసి మెదక్ లోక్ సభ స్థానాన్ని గెలుచుకుంటామని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే బీజేపీ, బీఆర్ఎస్ కోరిక ఫెయిల్ అవుతుందని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా తొలగించాలని తాను డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని… కానీ అది ముగిసిపోయిన ఎపిసోడ్ అన్నారు. తాను కాంగ్రెస్ లైన్లో వెళతానన్నారు. తాను రేవంత్ రెడ్డిపై మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ తనకు ఓ మాట చెప్పారని… మనం అధికారంలోకి రాబోతున్నాం… ఎవరినీ ఏమీ అనవద్దని సూచించారని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తను కాబట్టి మా పార్టీ నేత చెప్పింది విన్నానన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ బీజేపీలో ఉండదన్నారు.
ఆనాటి నుంచి తాను రేవంత్ రెడ్డిని ఏమీ అనలేదని తెలిపారు. అయినా అది మా కాంగ్రెస్ ఇంటి పంచాయతీ అని పేర్కొన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి హామీలు అమలు చేస్తూ మంచి పాలన అందిస్తామన్నారు. మా పార్టీలో మేం కొట్టుకుంటాం… తిట్టుకుంటాం… మా పైకి ఎవరైనా వస్తే మేమంతా కలిసి తిరగబడతామన్నారు. ఇదే కాంగ్రెస్ పద్ధతి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
-
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
-
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
-
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!