MLA Jagga Reddy : బీజేపీ గవర్నర్ని మార్చొచ్చు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
‘అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్పై బీజేపీ అసంతృప్తిలో ఉంది. బీజేపీ తమిళిసైని మార్చొచ్చు. నాకు కాంగ్రెస్ కంటే బీజేపీ చరిత్ర తెలుసు.’ అంటూ మీడియాతో చిట్చాట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎవరికి బానిస కాదు.. ఎవరికి లాలూచీ పడనన్నారు. పేదలకు సాయం అవుతుంది అంటే.. ఎదుటి వాళ్ళు ఎంత బలవంతులు అయినా చూడనని ఆయన వెల్లడించారు. నేను అసెంబ్లీలో సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని, రాజకీయంగా బీఆర్ఎస్ని తిట్టి అహో.. అనిపించుకోవాలి అనే దానికంటే.. ప్రజల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చూశానని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ని తిడితే పది మంది సంతోష పడతారు కానీ.. సమస్యలు చెప్తే.. పరిష్కారం అయినా అవుతుందన్నారు. సదాశివపేట వరకు మెట్రో కావాలని డిమాండ్ లేవనెత్తినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా.. కేసీఆర్ కిట్ తో మహిళకు బెనిఫిట్ అవుతుందన్నారు. అది ఒప్పుకోవాల్సిందేనని, క్యాన్సర్ , హార్ట్ ఆపరేషన్ లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని సూచన చేశానన్నారు జగ్గారెడ్డి. కల్యాణ లక్ష్మీ మంచి పథకమేనని, మంచిని మంచి అనాల్సిందేనని జగ్గారెడ్డి అన్నారు.
Also Read : Tamilnadu Crime: పిలిచినా భార్య రాలేదని.. భర్త కిరాతక పని.. నడిరోడ్డుపైనే..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
వీఆర్ఏ, ఐకేపీల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, యాదగిరిగుట్ట పునర్నిర్మాణం మంచి నిర్ణయమన్నారు. అక్కడికి కూడా మెట్రో వేయాలని, అనాథ పిల్లకు వసతి గృహాలు ఏర్పాటు చేస్తా అన్నారు… కేసీఆర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వృద్ధాప్య పింఛన్ లు ఇంట్లో ఇద్దరికి ఇవ్వాలన్నారు. దీంతోపాటు.. అసెంబ్లీలో గవర్నర్ తీరుపై బీజేపీ అసంతృప్తి తో ఉన్నట్టు ఉందని, గవర్నర్ను మార్చొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కానీ బీజేపీ తెలంగాణలో ఎన్ని గేమ్ లు ఆడినా… రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదని ఆయన స్పష్టం చేశారు. నాకు కాంగ్రెస్ కంటే బీజేపీ చరిత్ర ఎక్కువ తెలుసునని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర జాతీయ భావాలతో నడిచారని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ని ప్రధాని చేసిన చరిత్ర రాహుల్, సోనియా గాంధీలది ఆయన అన్నారు. బీజేపీ లెక్క… ఆదానీ.. అంబానీలను పెంచలేదని, అన్ని గ్రామాల్లో అందరూ బాగుండాలని ఉపాధి హామీ తెచ్చింది కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు.
Also Read : Virat Kohli: ఆస్ట్రేలియా జట్టుకి కోహ్లీ చుక్కలు చూపించడం ఖాయం
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!