Jyothula Chanti Babu: పవన్ కల్యాణ్ పిలిస్తే వెళ్లా.. ఇక్కడ టీడీపీ-జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదు
Jyothula Chanti Babu: జగ్గంపేట రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పుడు జనసేన పార్టీకి టచ్లోకి వెళ్లారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్తో ఆయన రహస్యంగా సమావేశం అయినట్టు వార్తలు వచ్చాయి.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ కష్టమని పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం ఉందట.. దీంతో.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. కానీ, జ్యోతుల నెహ్రూ నుంచి వ్యతిరేకత రావడంతో.. టీడీపీ అధిష్టానం జ్యోతుల చంటిబాబు చేరికను హోల్డ్లో పెట్టింది.. దీంతో.. జనసేన పార్టీ టచ్లోకి వెళ్లారు జగ్గంపేట ఎమ్మెల్యే..
Read Also: Alla Ramakrishna Reddy: ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన.. సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
పవన్ కల్యాణ్తో సమావేశంపై అనుచరులతో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిచారు.. అందుకే వెళ్లి కలిసినట్టు చెప్పుకొచ్చారు.. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి పవన్ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఇక, జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేసే పరిస్థితి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సర్వేల ద్వారా సీటు ఇవ్వడానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేసింది ఏమీ లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అంతా ప్రభుత్వ పరంగా చేసినవేనన్న ఆయన.. జనవరి 1వ తేదీన అనుచరులతో సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు సీటు ఇస్తున్న వారు పనికి వచ్చే వారేనా? అంటూ వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీచేయనున్నాయి.. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి.. అయితే, సీట్లు సర్దుబాటు జరగాల్సి ఉంది.. ఇలాంటి సమయంలో జ్యోతుల చంటిబాబు.. జగ్గంపేటలో టీడీపీ-జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించడం చర్చగా మారింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!