Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Jagan Slams Chandrababu Credit Row Over Google Data Center Visakhapatnam

YS Jagan: విశాఖ గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ వీళ్లదే.. జగన్ సంచలన వ్యాఖ్యలు..!

Published Date :October 23, 2025 , 1:15 pm
By RAMAKRISHNA KENCHE
YS Jagan: విశాఖ గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ వీళ్లదే.. జగన్ సంచలన వ్యాఖ్యలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

YS Jagan: ఇక యాడ్ ఏజెన్సీల రాష్ట్ర ప్రభుత్వ పాలన అని మాజీ సీఎం జగన్ విమర్శించారు.. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి.. పెర్ఫార్మెన్స్ మాత్రం వీక్ అన్నారు.. వేరే వాళ్ళకు దొరకాల్సిన క్రెడిట్ చోరీలో మాత్రం చంద్రబాబు పీక్ అని విమర్శించారు.. గత ప్రభుత్వ హయాంలో ఇంటర్నేషనల్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దే పనిలో భాగంగా అదానీ డేటా సెంటర్‌కు బీజం పడిందని తెలిపారు. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తీసుకువచ్చే కార్యక్రమానికి అంకురార్పణ కూడా అప్పుడే జరిగిందని చెప్పారు.. సబ్సీ కేబుల్ తీసుకురాకపోతే ఏ డేటా రాదని.. అదానీ డేటా సెంటర్ కు ఫౌండేషన్ వేయటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.. ఇది జరగటానికి వైసీపీ, అదానీ, కేంద్రం, సింగపూర్ చేసిన కృషి వల్లే ఇవాళ గూగుల్ విశాఖ వచ్చిందని కొనియాడారు.. ఆరోజు వైసీపీ కృషి వల్లే ఇప్పుడు గూగుల్ రావటానికి మార్గమైందని వెల్లడించారు. అదానీ పెట్టిన ప్రాజెక్టుకు ఇది విస్తరణ.. అక్టోబర్ 2022 నుంచి అదానీకి.. గూగుల్ కు బిజినెస్ రిలేషన్ షిప్ ఉందని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.. ఈ నేపథ్యంలోనే విశాఖలో మే 2023 లో ఫౌండేషన్ స్టోన్ వేశామన్నారు.. సబ్సీ కేబుల్ కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగిందని తెలిపారు.

READ MORE: India vs Australia: మెరిసిన రోహిత్, శ్రేయస్‌.. ఆస్ట్రేలియా టార్గెట్‌ ఎంతంటే..?

సముద్ర గర్భంలో సింగపూర్ నుంచి విశాఖ వరకు అదానీ సబ్సీ కేబుల్ వేయటం వల్లే గూగుల్ వచ్చిందని మాజీ సీఎం జగన్ వివరించారు.. ఆ రెండు కంపెనీలు వ్యాపార భాగస్వాములు కాబట్టే డేటా సెంటర్ విశాఖ వచ్చిందన్నారు.. 300 మెగావాట్ల డేట్ సెంటర్ కు అప్పుడు వైసీపీ వేసిన అడుగుల వల్లే సాధ్యమైందన్నారు.. “అదానీ ఇన్ఫ్రా కు సంబంధించిన వాళ్ళే ఈ డేటా సెంటర్ నిర్మిస్తున్నారు.. గూగుల్ నుంచి అలెగ్జాండర్ స్మిత్ ఐటీ సెక్రటరీ గా ఉన్న భాస్కర్ కు ఓ లెటర్ కూడా రాశారు.. అదానీ కి చెందిన మూడు కంపెనీలకు ల్యాండ్ అలాట్ చేయాలని కోరారు.. ఈ ప్రాజెక్ట్ తేవటం కోసం 87 వేల కోట్లు అదానీ ఖర్చు చేసి గూగుల్ ని తీసుకువస్తునారు.. అదానీ 10 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తేనే గూగుల్ వస్తుంది.. ఇలాంటి డేటా సెంటర్ అదానీ లాంటి మన దేశీయ కంపెనీ పెడుతుందని గర్వంగా చెప్పుకోవాలి.. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి.. కనీసం అదానీ కి ఒక థాంక్స్ అయినా చెప్పారా.. ఇదంతా చెప్తే జగన్ ప్రభుత్వం లోనే జరిగిందని క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబు కు ఇష్టం లేదు.. డేటా సెంటర్ లో అతిముఖ్యమైన అంశం సముద్ర గర్భంలో వేస్తున్న కేబుల్.. 3900 కిలోమీటర్ల మేరా కేబుల్ వేయాలి.. అంతా పూర్తయిన తర్వాత చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి వీళ్ళు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.. గతంలో 300 మెగావాట్ల డేటా సెంటర్ కోసం భూ కేటాయింపులు చేశాం.. ప్రపంచాన్ని శాసించబోయే టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. వీటికి డేట్ సెంటర్ కీ ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది.. 300 మెగావాట్ల డేటా సెంటర్ పెడితే 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని కోరాం.. ఐటీ పార్క్, స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని కోరాం.. చంద్రబాబు ఇలా చేయటం కొత్తకాదు.. హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబు ది సేమ్ స్టోరీ.. మాదాపూర్ సైబర్ టవర్స్ ఆరెకరాల స్థలంలో వచ్చిన చిన్న ప్రాజెక్ట్.. దీనికి పునాది రాయి వేసింది ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్ జనార్ధన్ రెడ్డి.. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు దాన్ని ప్రైవేట్ వాళ్లకు ఇచ్చి కట్టించాడు.. ఆ బిల్డింగ్ ఒకటి కట్టి హైదరాబాద్ మొత్తం నేనే కట్టాను అని ప్రొజెక్షన్ చేసుకున్నాడు.. 2004, 2009 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచారు.. 2014, 2019 లో కేసీఆర్ గెలిచాడు.. అయిన ఈ 20 ఏళ్ల అభివృద్ధి నాదే అంటాడు.. ఒక్క బిల్డింగ్ కట్టి అభివృద్ధి మొత్తం నాదే అనటం మూర్ఖత్వం.. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ వచ్చాయి కాబట్టే హైదరాబాద్ అంతలా అభివృద్ధి చెందింది.. ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా చంద్రబాబు దిగిపోయిన తర్వాత భారీగా పెరిగాయి.. 2009 నాటికి 5600 కోట్ల నుంచి 39 వేల కోట్లకు ఐటీ ఎగుమతులు దాటాయి.. 2014 నాటికి 56 వేలకోట్లు దాటాయి.. వేరే వాళ్ళు చేస్తే ఆ క్రెడిట్ వాళ్లకు ఇవ్వాలి.. కేసీఆర్ వచ్చిన తర్వాత గొప్ప పరిపాలన చేశారు కాబట్టే అభివృద్ధి సాధ్యం అయ్యింది.. కేసీఆర్ 2 లక్షల కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు తీసుకువెళ్ళారు.. 2004 లో పాలన వదిలేసి ఇప్పటికీ అంతా నేనే వేశా అని చెప్పుకునే చంద్రబాబు.. విశాఖ దేశంలోని ఇతర మెట్రో నగరాలను తలదన్నేలా అడుగులు వేశాం.. భోగాపురం ఎయిర్ పోర్టు కు మేమే అన్నీ చేశాం.. మరో ఏడాదిలో పూర్తి కూడా అవుతుంది.. ఉత్తరాంధ్ర దశ దిశ మార్చటం కోసం పోర్టు నిర్మాణం చేపట్టాం..” అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

READ MORE: Jubilee HIlls Bypoll : 135 సెట్ల నామినేషన్లకు ఆమోదం..

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adani submarine cable project
  • Andhra Pradesh Politics
  • ap political news
  • Chandrababu Naidu criticism
  • Google data center Visakhapatnam

తాజావార్తలు

  • BJP Chief Ministers: దేశంలో పెరిగిన బీజేపీ సీఎంలు.. సంఖ్య ఎంతంటే..!

  • Rukmini Vasanth: రుక్మిణి వసంత్ క్రేజీ లైనప్..మరో స్టార్ హీరోతో ‘బంపర్ ఆఫర్’!

  • Tirupati Crime: తిరుపతిలో దారుణం.. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం.. గొంతుకోసి హత్య

  • Naga Chaitanya : వృషకర్మ, దూత – 2పై చైతు సెన్సేషన్ కామెంట్స్

  • Virat Kohli-RCB: 4-5 రోజులుగా ఆరోగ్యం బాలేదు.. అయినా ఆర్‌సీబీ కోసమే బరిలోకి దిగా!

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions