Jagadish Reddy : ఒక్క క్షణం కూడా సీఎం గా ఉండే అర్హత రేవంత్ రెడ్డికి లేదు
- ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత రేవంత్ రెడ్డికి లేదు
- వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- మొదటి నుండి బీఆర్ఎస్ చెప్తున్న మాటలు నేడు నిజమయ్యాయి : జగదీష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక్క క్షణం కూడా సీఎం గా కొనసాగేందుకు అర్హత లేదని ఆరోపించారు. ఆయన తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ తొలి నుంచీ చెబుతోన్న విషయం నేడు నిజమవుతుందన్న విషయం స్పష్టమైందన్నారు. “ఓనమాలు రాని వాడిలా పదో తరగతి చదివినట్లున్నది రేవంత్ తీరు,” అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ముప్పు లేదని, కానీ రేవంత్ పరిపాలనకు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
Alert.. Alert: తెలంగాణ వాసులారా బహుపరాక్.. నేటి అర్థరాత్రి నుంచి బస్సులు బంద్..!
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
కేసీఆర్ హయాంలో అప్పులనుంచి తెలంగాణ రాష్ట్రానికి రెండున్నర లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, కానీ రేవంత్ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోగా, మంత్రుల ఆదాయం మాత్రం పెరిగిందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. “రాష్ట్ర ఆదాయం లూటీ చేస్తూ ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. సీఎం పదవి కోసం మంత్రులు పోటీ పడి సంపాదనలో మునిగిపోతున్నారు” అని వ్యాఖ్యానించారు. హామీల కోసం దొంగ ఏడుపులు
రేవంత్ రెడ్డి హామీలను తప్పించుకునేందుకు “దొంగ ఏడుపులు” ఏడుస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. నిన్న సీఎం మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధమని, ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే అని అన్నారు. “మాది వందేళ్ళ చరిత్ర, అపార పరిపాలనా అనుభవం. ఒక్క సంవత్సరం మంత్రులు కడుపు కట్టుకుంటే అన్ని హామీలు అమలయ్యేవి,” అని సూచించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు బజార్లో పెట్టారని ఆరోపిస్తూ, రాష్ట్ర మానాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వాసికి ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..