Jagadish Reddy : ఒక్క క్షణం కూడా సీఎం గా ఉండే అర్హత రేవంత్ రెడ్డికి లేదు
- ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత రేవంత్ రెడ్డికి లేదు
- వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- మొదటి నుండి బీఆర్ఎస్ చెప్తున్న మాటలు నేడు నిజమయ్యాయి : జగదీష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక్క క్షణం కూడా సీఎం గా కొనసాగేందుకు అర్హత లేదని ఆరోపించారు. ఆయన తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ తొలి నుంచీ చెబుతోన్న విషయం నేడు నిజమవుతుందన్న విషయం స్పష్టమైందన్నారు. “ఓనమాలు రాని వాడిలా పదో తరగతి చదివినట్లున్నది రేవంత్ తీరు,” అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ముప్పు లేదని, కానీ రేవంత్ పరిపాలనకు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
Alert.. Alert: తెలంగాణ వాసులారా బహుపరాక్.. నేటి అర్థరాత్రి నుంచి బస్సులు బంద్..!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
కేసీఆర్ హయాంలో అప్పులనుంచి తెలంగాణ రాష్ట్రానికి రెండున్నర లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, కానీ రేవంత్ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోగా, మంత్రుల ఆదాయం మాత్రం పెరిగిందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. “రాష్ట్ర ఆదాయం లూటీ చేస్తూ ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. సీఎం పదవి కోసం మంత్రులు పోటీ పడి సంపాదనలో మునిగిపోతున్నారు” అని వ్యాఖ్యానించారు. హామీల కోసం దొంగ ఏడుపులు
రేవంత్ రెడ్డి హామీలను తప్పించుకునేందుకు “దొంగ ఏడుపులు” ఏడుస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. నిన్న సీఎం మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధమని, ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే అని అన్నారు. “మాది వందేళ్ళ చరిత్ర, అపార పరిపాలనా అనుభవం. ఒక్క సంవత్సరం మంత్రులు కడుపు కట్టుకుంటే అన్ని హామీలు అమలయ్యేవి,” అని సూచించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు బజార్లో పెట్టారని ఆరోపిస్తూ, రాష్ట్ర మానాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వాసికి ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!