Jagadish Reddy : ఒక్క క్షణం కూడా సీఎం గా ఉండే అర్హత రేవంత్ రెడ్డికి లేదు
- ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత రేవంత్ రెడ్డికి లేదు
- వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- మొదటి నుండి బీఆర్ఎస్ చెప్తున్న మాటలు నేడు నిజమయ్యాయి : జగదీష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక్క క్షణం కూడా సీఎం గా కొనసాగేందుకు అర్హత లేదని ఆరోపించారు. ఆయన తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ తొలి నుంచీ చెబుతోన్న విషయం నేడు నిజమవుతుందన్న విషయం స్పష్టమైందన్నారు. “ఓనమాలు రాని వాడిలా పదో తరగతి చదివినట్లున్నది రేవంత్ తీరు,” అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ముప్పు లేదని, కానీ రేవంత్ పరిపాలనకు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
Alert.. Alert: తెలంగాణ వాసులారా బహుపరాక్.. నేటి అర్థరాత్రి నుంచి బస్సులు బంద్..!
Also Read
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
కేసీఆర్ హయాంలో అప్పులనుంచి తెలంగాణ రాష్ట్రానికి రెండున్నర లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, కానీ రేవంత్ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోగా, మంత్రుల ఆదాయం మాత్రం పెరిగిందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. “రాష్ట్ర ఆదాయం లూటీ చేస్తూ ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. సీఎం పదవి కోసం మంత్రులు పోటీ పడి సంపాదనలో మునిగిపోతున్నారు” అని వ్యాఖ్యానించారు. హామీల కోసం దొంగ ఏడుపులు
రేవంత్ రెడ్డి హామీలను తప్పించుకునేందుకు “దొంగ ఏడుపులు” ఏడుస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. నిన్న సీఎం మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధమని, ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే అని అన్నారు. “మాది వందేళ్ళ చరిత్ర, అపార పరిపాలనా అనుభవం. ఒక్క సంవత్సరం మంత్రులు కడుపు కట్టుకుంటే అన్ని హామీలు అమలయ్యేవి,” అని సూచించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు బజార్లో పెట్టారని ఆరోపిస్తూ, రాష్ట్ర మానాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వాసికి ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!