IT Raids : తెలంగాణలో ఆగని ఐటీ రైడ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వ్యాప్తంగా ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి బాల వికాస్ సోషల్ సర్వీస్ సొసైటీ, బాల థెరిస్సా సొసైటీల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సొసైటి ఫౌండర్ సింగిరెడ్డి శౌరెడ్డికి చెందిన ఆస్తులపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన 412 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టింది.
Also Read : H3N2 Virus: మహారాష్ట్రలో హెచ్3ఎన్2 కలకలం.. ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం వెల్లడి
Also Read
సొసైటి పేరు చెప్పి విదేశాల నుంచి సింగిరెడ్డి శౌరెడ్డి నిధులు రాబట్టారని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. విదేశీ నిధులన్నీ సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. శౌరెడ్డి, భార్య సునీతారెడ్డి పేర్లపై భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లుగా నిర్థారించింది. అలాగే సొసైటిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగుల పేర్లపైనా ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. వరంగల్, హైదరాబాద్ తో కలిపి మొత్తం 40 చోట్ల ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
Also Read : IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. షెడ్యూల్ ఇదే!
తెలంగాణలోని క్రిస్టియన్ మిషనరీలపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు గత కొన్ని రోజులుగా ప్రత్యేక నజర్ పెట్టారు. అందులో భాగంగానే బాల వికాస్ సర్వీస్ సొసైటీ, బాల థెరిస్సా సొసైటిలో తనిఖీలు చేస్తున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు హైదరాబాద్, వరంగల్, మెదక్, కీసర, జీడిమెట్ల సహా 40 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఈడీ, ఐటీ, సీబీఐ పేరుతో నిత్యం ఏదో ఒక చోట సోదాలు జరుగుతునే ఉన్నాయి. క్రమంగా తెలంగాణలో ఈ తనిఖీలతో ప్రభుత్వం కేంద్ర సర్కార్ పై విమర్శలు గుప్పిస్తుంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..