ISRO Satellite Images: ఈ ఒక్క ఫోటో చాలు.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO Satellite Images: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో గత వారంలో సంభవించిన క్లౌడ్ బ్రస్ట్ తరవాత అందుకు సంబంధించిన భయానక దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టింది. ఈ విపత్తు కారణంగా ధరాళీ గ్రామం దాదాపు పూర్తిగా నాశనం అయిందని ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ఏడాది జూన్లో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో భగీరథి నది ఒడ్డున ఇళ్లతో, చిన్న తోటలతో, ఇతర నిర్మాణాలతో ఉన్న ఒక భూభాగం కనిపించింది. కానీ, ఆగస్టు 7న తీసిన రెండో చిత్రంలో ఆ భూభాగం పూర్తిగా నీటితో నిండి అక్కడ ఉన్న ఇళ్లు, నిర్మాణాలు పూర్తిగా కనుమరుగయ్యాయి.
HYDRA: ఉద్యోగుల జీతాలపై స్పష్టత.. హైడ్రా కమిషనర్ భరోసా!
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ధరాళీ గ్రామం అంతర్భాగంలో ప్రవహించే ఖీర్ గాడ్ అనే ఉపనది కలిసే ప్రాంతం కూడా పూర్తిగా నాశనం అయ్యింది. అక్కడి రహదారులు, ఖీర్ గాడ్పై ఉన్న చిన్న వంతెన మొత్తం కొట్టుకుపోయాయి. ఇకపోతే ఆ జిల్లా అధికారులు సోమవారం ఉదయం వరకు దాదాపు 1,300 మందిని రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. గఢ్వాల్ కమిషనర్ వినయ్ పాండే ప్రకారం.. ప్రస్తుతం రక్షణ చర్యలు ముగిసాయని, రహదారి అనుసంధానం చాలావరకు పునరుద్ధరించబడిందని ఆయన తెలిపారు. నేటి సాయంత్రానికి పూర్తి రహదారి కనెక్టివిటీ పునరుద్ధరించబడుతుంది. ఆహారం, బట్టలు, అవసరమైన వస్తువులు పంపిణీ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని పంపిణీ చేయడానికి జిల్లా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన తెలిపారు.
Supreme Court: ఆర్మీ తీరుపై సుప్రీం కోర్టు ఫైర్..!
ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదు మరణాలు నమోదయ్యాయి. ఇంకా 43 మంది (వీరిలో తొమ్మిది మంది సైనికులు) కనిపించకుండా పోయారని అధికారులు ధృవీకరించారు. ఇక నేడు ఉదయం కురిసిన వర్షం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ‘యెల్లో’ అలర్ట్ జారీ చేసింది. ఇక అల్మోరా, డెహ్రాడూన్, హరిద్వార్, నైనిటాల్, పౌరీ, ఉదమ్ సింగ్ నగర్ జిల్లాల్లో తదుపరి గంటల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఏకంగా ‘రెడ్’ అలర్ట్ జారీ చేశారు. రాజధాని డెహ్రాడూన్తో పాటు ఇప్పటికే ప్రభావితమైన ఉత్తరకాశీ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది.
Satellite Insights Aiding Rescue & Relief Ops
ISRO/NRSC used Cartosat-2S data to assess the devastating Aug 5 flash flood in Dharali & Harsil, Uttarakhand.
High-res imagery reveals submerged buildings, debris spread (~20ha), & altered river paths, vital for rescue teams on… pic.twitter.com/ZK0u50NnYF
— ISRO (@isro) August 7, 2025
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!