ISRO Satellite Images: ఈ ఒక్క ఫోటో చాలు.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO Satellite Images: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో గత వారంలో సంభవించిన క్లౌడ్ బ్రస్ట్ తరవాత అందుకు సంబంధించిన భయానక దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టింది. ఈ విపత్తు కారణంగా ధరాళీ గ్రామం దాదాపు పూర్తిగా నాశనం అయిందని ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ఏడాది జూన్లో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో భగీరథి నది ఒడ్డున ఇళ్లతో, చిన్న తోటలతో, ఇతర నిర్మాణాలతో ఉన్న ఒక భూభాగం కనిపించింది. కానీ, ఆగస్టు 7న తీసిన రెండో చిత్రంలో ఆ భూభాగం పూర్తిగా నీటితో నిండి అక్కడ ఉన్న ఇళ్లు, నిర్మాణాలు పూర్తిగా కనుమరుగయ్యాయి.
HYDRA: ఉద్యోగుల జీతాలపై స్పష్టత.. హైడ్రా కమిషనర్ భరోసా!
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
ధరాళీ గ్రామం అంతర్భాగంలో ప్రవహించే ఖీర్ గాడ్ అనే ఉపనది కలిసే ప్రాంతం కూడా పూర్తిగా నాశనం అయ్యింది. అక్కడి రహదారులు, ఖీర్ గాడ్పై ఉన్న చిన్న వంతెన మొత్తం కొట్టుకుపోయాయి. ఇకపోతే ఆ జిల్లా అధికారులు సోమవారం ఉదయం వరకు దాదాపు 1,300 మందిని రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. గఢ్వాల్ కమిషనర్ వినయ్ పాండే ప్రకారం.. ప్రస్తుతం రక్షణ చర్యలు ముగిసాయని, రహదారి అనుసంధానం చాలావరకు పునరుద్ధరించబడిందని ఆయన తెలిపారు. నేటి సాయంత్రానికి పూర్తి రహదారి కనెక్టివిటీ పునరుద్ధరించబడుతుంది. ఆహారం, బట్టలు, అవసరమైన వస్తువులు పంపిణీ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని పంపిణీ చేయడానికి జిల్లా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన తెలిపారు.
Supreme Court: ఆర్మీ తీరుపై సుప్రీం కోర్టు ఫైర్..!
ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదు మరణాలు నమోదయ్యాయి. ఇంకా 43 మంది (వీరిలో తొమ్మిది మంది సైనికులు) కనిపించకుండా పోయారని అధికారులు ధృవీకరించారు. ఇక నేడు ఉదయం కురిసిన వర్షం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ‘యెల్లో’ అలర్ట్ జారీ చేసింది. ఇక అల్మోరా, డెహ్రాడూన్, హరిద్వార్, నైనిటాల్, పౌరీ, ఉదమ్ సింగ్ నగర్ జిల్లాల్లో తదుపరి గంటల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఏకంగా ‘రెడ్’ అలర్ట్ జారీ చేశారు. రాజధాని డెహ్రాడూన్తో పాటు ఇప్పటికే ప్రభావితమైన ఉత్తరకాశీ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది.
Satellite Insights Aiding Rescue & Relief Ops
ISRO/NRSC used Cartosat-2S data to assess the devastating Aug 5 flash flood in Dharali & Harsil, Uttarakhand.
High-res imagery reveals submerged buildings, debris spread (~20ha), & altered river paths, vital for rescue teams on… pic.twitter.com/ZK0u50NnYF
— ISRO (@isro) August 7, 2025
తాజావార్తలు
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!