Supreme Court: ఆర్మీ తీరుపై సుప్రీం కోర్టు ఫైర్..!
Supreme Court: ఇండియన్ ఆర్మీ తీరుపై సోమవారం దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ (లీగల్) బ్రాంచి పోస్టుల్లో నియామకాల కోసం అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్ నిష్పత్తి విధానం సరికాదని, దాన్ని అమలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళలపై పరిమితి పెట్టి ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్ చేయకూడదని తేల్చిచెప్పింది. లింగ తటస్థతకు నిజమైన అర్ధం.. స్త్రీ, పురుష భేదం లేకుండా అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేయడమేనని పేర్కొంది.
READ MORE: Tollywood : ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో ముగిసిన నిర్మాతలు భేటీ.. నంది అవార్డ్స్ పై కీలక ప్రకటన
Also Read
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
ఇకపై సమానత్వ పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలి..
సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో అష్నూర్ కౌర్, ఆస్థ త్యాగీ అనే మహిళా అధికారులు వరుసగా 4, 5వ ర్యాంకులు సాధించారు. వీరికి మెరిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మహిళల కోటాల్లో ఖాళీలు లేవంటూ విధుల్లోకి తీసుకోలేదు. ఈక్రమంలో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం వీరి పిటిషన్పై గతంలో విచారణ జరిపి అప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సుప్రీం ధర్మాసనం ఈ అంశంపై తీర్పు వెలువరించిన.. లింగ తటస్థతకు నిజమైన అర్ధం.. స్త్రీ, పురుష భేదం లేకుండా అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేయడమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆర్మీ ఉన్నతాధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల విభాగంలో పురుషులకు 6.. మహిళలకు 3 పోస్టులు కేటాయించాలని నిష్పత్తి పెట్టడం ఏకపక్ష నిర్ణయంగా తెలిపింది. ఇలా మహిళలకు సీట్లను పరిమితం చేయడం సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుంది. మహిళలపై పరిమితి పెట్టి.. ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్ చేయడం సమంజసం కాదని వెల్లడించింది. ఈ విధానాలను అనుసరిస్తే ఏ దేశం భద్రంగా ఉండబోదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా స్త్రీ, పురుష అభ్యర్థుల మెరిట్ జాబితాను బహిర్గతం చేయాలని సూచించింది. ఇకపై సమానత్వ పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాము సైన్యంపై తమ సొంత అభిరుచులను విధించడం లేదని, రాజ్యాంగం, చట్టం ఆదేశాన్ని అమలు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
READ MORE: MLA Rajagopal Reddy: డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో ట్వీట్!
తాజావార్తలు
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
-
US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!