Supreme Court: ఆర్మీ తీరుపై సుప్రీం కోర్టు ఫైర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఇండియన్ ఆర్మీ తీరుపై సోమవారం దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ (లీగల్) బ్రాంచి పోస్టుల్లో నియామకాల కోసం అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్ నిష్పత్తి విధానం సరికాదని, దాన్ని అమలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళలపై పరిమితి పెట్టి ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్ చేయకూడదని తేల్చిచెప్పింది. లింగ తటస్థతకు నిజమైన అర్ధం.. స్త్రీ, పురుష భేదం లేకుండా అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేయడమేనని పేర్కొంది.
READ MORE: Tollywood : ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో ముగిసిన నిర్మాతలు భేటీ.. నంది అవార్డ్స్ పై కీలక ప్రకటన
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ఇకపై సమానత్వ పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలి..
సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో అష్నూర్ కౌర్, ఆస్థ త్యాగీ అనే మహిళా అధికారులు వరుసగా 4, 5వ ర్యాంకులు సాధించారు. వీరికి మెరిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మహిళల కోటాల్లో ఖాళీలు లేవంటూ విధుల్లోకి తీసుకోలేదు. ఈక్రమంలో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం వీరి పిటిషన్పై గతంలో విచారణ జరిపి అప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సుప్రీం ధర్మాసనం ఈ అంశంపై తీర్పు వెలువరించిన.. లింగ తటస్థతకు నిజమైన అర్ధం.. స్త్రీ, పురుష భేదం లేకుండా అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేయడమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆర్మీ ఉన్నతాధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల విభాగంలో పురుషులకు 6.. మహిళలకు 3 పోస్టులు కేటాయించాలని నిష్పత్తి పెట్టడం ఏకపక్ష నిర్ణయంగా తెలిపింది. ఇలా మహిళలకు సీట్లను పరిమితం చేయడం సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుంది. మహిళలపై పరిమితి పెట్టి.. ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్ చేయడం సమంజసం కాదని వెల్లడించింది. ఈ విధానాలను అనుసరిస్తే ఏ దేశం భద్రంగా ఉండబోదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా స్త్రీ, పురుష అభ్యర్థుల మెరిట్ జాబితాను బహిర్గతం చేయాలని సూచించింది. ఇకపై సమానత్వ పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాము సైన్యంపై తమ సొంత అభిరుచులను విధించడం లేదని, రాజ్యాంగం, చట్టం ఆదేశాన్ని అమలు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
READ MORE: MLA Rajagopal Reddy: డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో ట్వీట్!
తాజావార్తలు
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!