ISRO Satellite Images: ఈ ఒక్క ఫోటో చాలు.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO Satellite Images: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో గత వారంలో సంభవించిన క్లౌడ్ బ్రస్ట్ తరవాత అందుకు సంబంధించిన భయానక దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టింది. ఈ విపత్తు కారణంగా ధరాళీ గ్రామం దాదాపు పూర్తిగా నాశనం అయిందని ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ఏడాది జూన్లో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో భగీరథి నది ఒడ్డున ఇళ్లతో, చిన్న తోటలతో, ఇతర నిర్మాణాలతో ఉన్న ఒక భూభాగం కనిపించింది. కానీ, ఆగస్టు 7న తీసిన రెండో చిత్రంలో ఆ భూభాగం పూర్తిగా నీటితో నిండి అక్కడ ఉన్న ఇళ్లు, నిర్మాణాలు పూర్తిగా కనుమరుగయ్యాయి.
HYDRA: ఉద్యోగుల జీతాలపై స్పష్టత.. హైడ్రా కమిషనర్ భరోసా!
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ధరాళీ గ్రామం అంతర్భాగంలో ప్రవహించే ఖీర్ గాడ్ అనే ఉపనది కలిసే ప్రాంతం కూడా పూర్తిగా నాశనం అయ్యింది. అక్కడి రహదారులు, ఖీర్ గాడ్పై ఉన్న చిన్న వంతెన మొత్తం కొట్టుకుపోయాయి. ఇకపోతే ఆ జిల్లా అధికారులు సోమవారం ఉదయం వరకు దాదాపు 1,300 మందిని రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. గఢ్వాల్ కమిషనర్ వినయ్ పాండే ప్రకారం.. ప్రస్తుతం రక్షణ చర్యలు ముగిసాయని, రహదారి అనుసంధానం చాలావరకు పునరుద్ధరించబడిందని ఆయన తెలిపారు. నేటి సాయంత్రానికి పూర్తి రహదారి కనెక్టివిటీ పునరుద్ధరించబడుతుంది. ఆహారం, బట్టలు, అవసరమైన వస్తువులు పంపిణీ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని పంపిణీ చేయడానికి జిల్లా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన తెలిపారు.
Supreme Court: ఆర్మీ తీరుపై సుప్రీం కోర్టు ఫైర్..!
ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదు మరణాలు నమోదయ్యాయి. ఇంకా 43 మంది (వీరిలో తొమ్మిది మంది సైనికులు) కనిపించకుండా పోయారని అధికారులు ధృవీకరించారు. ఇక నేడు ఉదయం కురిసిన వర్షం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ‘యెల్లో’ అలర్ట్ జారీ చేసింది. ఇక అల్మోరా, డెహ్రాడూన్, హరిద్వార్, నైనిటాల్, పౌరీ, ఉదమ్ సింగ్ నగర్ జిల్లాల్లో తదుపరి గంటల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఏకంగా ‘రెడ్’ అలర్ట్ జారీ చేశారు. రాజధాని డెహ్రాడూన్తో పాటు ఇప్పటికే ప్రభావితమైన ఉత్తరకాశీ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది.
Satellite Insights Aiding Rescue & Relief Ops
ISRO/NRSC used Cartosat-2S data to assess the devastating Aug 5 flash flood in Dharali & Harsil, Uttarakhand.
High-res imagery reveals submerged buildings, debris spread (~20ha), & altered river paths, vital for rescue teams on… pic.twitter.com/ZK0u50NnYF
— ISRO (@isro) August 7, 2025
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..