ISRO Satellite Images: ఈ ఒక్క ఫోటో చాలు.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO Satellite Images: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో గత వారంలో సంభవించిన క్లౌడ్ బ్రస్ట్ తరవాత అందుకు సంబంధించిన భయానక దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టింది. ఈ విపత్తు కారణంగా ధరాళీ గ్రామం దాదాపు పూర్తిగా నాశనం అయిందని ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ఏడాది జూన్లో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో భగీరథి నది ఒడ్డున ఇళ్లతో, చిన్న తోటలతో, ఇతర నిర్మాణాలతో ఉన్న ఒక భూభాగం కనిపించింది. కానీ, ఆగస్టు 7న తీసిన రెండో చిత్రంలో ఆ భూభాగం పూర్తిగా నీటితో నిండి అక్కడ ఉన్న ఇళ్లు, నిర్మాణాలు పూర్తిగా కనుమరుగయ్యాయి.
HYDRA: ఉద్యోగుల జీతాలపై స్పష్టత.. హైడ్రా కమిషనర్ భరోసా!
Also Read
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
ధరాళీ గ్రామం అంతర్భాగంలో ప్రవహించే ఖీర్ గాడ్ అనే ఉపనది కలిసే ప్రాంతం కూడా పూర్తిగా నాశనం అయ్యింది. అక్కడి రహదారులు, ఖీర్ గాడ్పై ఉన్న చిన్న వంతెన మొత్తం కొట్టుకుపోయాయి. ఇకపోతే ఆ జిల్లా అధికారులు సోమవారం ఉదయం వరకు దాదాపు 1,300 మందిని రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. గఢ్వాల్ కమిషనర్ వినయ్ పాండే ప్రకారం.. ప్రస్తుతం రక్షణ చర్యలు ముగిసాయని, రహదారి అనుసంధానం చాలావరకు పునరుద్ధరించబడిందని ఆయన తెలిపారు. నేటి సాయంత్రానికి పూర్తి రహదారి కనెక్టివిటీ పునరుద్ధరించబడుతుంది. ఆహారం, బట్టలు, అవసరమైన వస్తువులు పంపిణీ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని పంపిణీ చేయడానికి జిల్లా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన తెలిపారు.
Supreme Court: ఆర్మీ తీరుపై సుప్రీం కోర్టు ఫైర్..!
ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదు మరణాలు నమోదయ్యాయి. ఇంకా 43 మంది (వీరిలో తొమ్మిది మంది సైనికులు) కనిపించకుండా పోయారని అధికారులు ధృవీకరించారు. ఇక నేడు ఉదయం కురిసిన వర్షం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ‘యెల్లో’ అలర్ట్ జారీ చేసింది. ఇక అల్మోరా, డెహ్రాడూన్, హరిద్వార్, నైనిటాల్, పౌరీ, ఉదమ్ సింగ్ నగర్ జిల్లాల్లో తదుపరి గంటల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఏకంగా ‘రెడ్’ అలర్ట్ జారీ చేశారు. రాజధాని డెహ్రాడూన్తో పాటు ఇప్పటికే ప్రభావితమైన ఉత్తరకాశీ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది.
Satellite Insights Aiding Rescue & Relief Ops
ISRO/NRSC used Cartosat-2S data to assess the devastating Aug 5 flash flood in Dharali & Harsil, Uttarakhand.
High-res imagery reveals submerged buildings, debris spread (~20ha), & altered river paths, vital for rescue teams on… pic.twitter.com/ZK0u50NnYF
— ISRO (@isro) August 7, 2025
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!