Chandrayaan-3: చంద్రుడిపై మరోసారి ‘సూరీడు’.. అప్డేట్ల కోసం ఇస్రో వెయింటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రయాన్-3 మిషన్కు రేపు ముఖ్యమైన రోజు.. చంద్రునిపై 14 రోజుల రాత్రి రేపటితో ముగియనుంది. చంద్రయాన్-3 మిషన్లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్ నుండి బయటకు రాబోతున్నాయి. 16 రోజుల పాటు స్లీప్ మోడ్లో ఉన్న తర్వాత.. ల్యాండర్, రోవర్లను ఇస్రో శుక్రవారం (సెప్టెంబర్ 22) యాక్టివేట్ చేయనుంది. అదృష్టం ఉంటే అదే జరుగుతుందని.. రేపు ల్యాండర్, రోవర్ రెండింటినీ యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో తెలిపింది. దీంతో చంద్రుని ఉపరితలాన్ని మరింత పరిశోధించడానికి ఉపయోగపడే మరికొన్ని ప్రయోగాత్మక డేటాను తాము పొందుతామని పేర్కొంది.
Karnataka: మణికట్టు కోసుకున్న 14 మంది విద్యార్థినులు.. అధికారులకు అంతుచిక్కని ఉదంతం..
Also Read
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
సూర్యుడి కిరణాలకు విక్రమ్ ల్యాండర్, రోవర్లో అమర్చిన బ్యాటరీలు రీఛార్జ్ కావాల్సి ఉంటుంది. పగటి సమయం మొదలు కాబోతోన్నందున సూర్యుడి వెలుగును గ్రహించి బ్యాటరీలు మళ్లీ రీఛార్జ్ అవుతాయని ఇస్రో ఆశిస్తోంది. అదే జరిగితే ఇంకో 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగించడానికి వీలు ఉంటుందని ఇస్రో పేర్కొంది. మరోవైపు ల్యాండర్, రోవర్లను రీయాక్టివేట్ చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రోవర్ చంద్రుడి ఉపరితలంపై సుమారు 200 మీటర్ల దూరం ప్రయాణించి కీలక సమాచారాన్ని భూమికి పంపింది. దక్షిణ ధృవం చీకటితో నిండిపోయే సమయం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ముందు జాగ్రత్తగా సెప్టెంబర్ 2న రోవర్ను, 4న ల్యాండర్ను స్లీపింగ్ మోడ్లోకి పంపించారు. దక్షిణ ధృవంపై ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటుంది. మైనస్ 180 నుంచి మైనస్ 230 డిగ్రీలు ఉంటుంది. అయితే ఇంత తీవ్రమైన చలిని ప్రజ్ఞాన్ రోవర్ తట్టుకుని తిరిగి పని చేయగలదా లేదా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా.. చంద్రుడిపై సూర్య కాంతి వస్తుండడంతో చంద్రయాన్-3 వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చూడాల్సి ఉందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ తెలిపారు. ఇప్పుడు చంద్రుడిపై సూర్యోదయం అయింది కాబట్టి, చంద్రయాన్-3 వ్యవస్థల్లో కదలిక వస్తే అవి శీతల వాతావరణాన్ని తట్టుకుని నిలబడినట్టు భావిస్తామని సోమ్ నాథ్ తెలిపారు.
Top Headlines @9PM : టాప్ న్యూస్
ఇదిలా ఉంటే.. చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23 సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. దీంతో చంద్రుడిపై ఈ భాగానికి చేరుకున్న తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రునిపై దిగిన తర్వాత.. ల్యాండర్, రోవర్, ఇతర పేలోడ్లు చాలా ముఖ్యమైన డేటాను పంపాయి. ల్యాండర్, రోవర్ ఒక చాంద్రమాన రోజు (సుమారు 14 రోజులు) వరకు పనిచేసేలా రూపొందించబడ్డాయి.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!