Chandrayaan-3: చంద్రుడిపై మరోసారి ‘సూరీడు’.. అప్డేట్ల కోసం ఇస్రో వెయింటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రయాన్-3 మిషన్కు రేపు ముఖ్యమైన రోజు.. చంద్రునిపై 14 రోజుల రాత్రి రేపటితో ముగియనుంది. చంద్రయాన్-3 మిషన్లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్ నుండి బయటకు రాబోతున్నాయి. 16 రోజుల పాటు స్లీప్ మోడ్లో ఉన్న తర్వాత.. ల్యాండర్, రోవర్లను ఇస్రో శుక్రవారం (సెప్టెంబర్ 22) యాక్టివేట్ చేయనుంది. అదృష్టం ఉంటే అదే జరుగుతుందని.. రేపు ల్యాండర్, రోవర్ రెండింటినీ యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో తెలిపింది. దీంతో చంద్రుని ఉపరితలాన్ని మరింత పరిశోధించడానికి ఉపయోగపడే మరికొన్ని ప్రయోగాత్మక డేటాను తాము పొందుతామని పేర్కొంది.
Karnataka: మణికట్టు కోసుకున్న 14 మంది విద్యార్థినులు.. అధికారులకు అంతుచిక్కని ఉదంతం..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
సూర్యుడి కిరణాలకు విక్రమ్ ల్యాండర్, రోవర్లో అమర్చిన బ్యాటరీలు రీఛార్జ్ కావాల్సి ఉంటుంది. పగటి సమయం మొదలు కాబోతోన్నందున సూర్యుడి వెలుగును గ్రహించి బ్యాటరీలు మళ్లీ రీఛార్జ్ అవుతాయని ఇస్రో ఆశిస్తోంది. అదే జరిగితే ఇంకో 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగించడానికి వీలు ఉంటుందని ఇస్రో పేర్కొంది. మరోవైపు ల్యాండర్, రోవర్లను రీయాక్టివేట్ చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రోవర్ చంద్రుడి ఉపరితలంపై సుమారు 200 మీటర్ల దూరం ప్రయాణించి కీలక సమాచారాన్ని భూమికి పంపింది. దక్షిణ ధృవం చీకటితో నిండిపోయే సమయం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ముందు జాగ్రత్తగా సెప్టెంబర్ 2న రోవర్ను, 4న ల్యాండర్ను స్లీపింగ్ మోడ్లోకి పంపించారు. దక్షిణ ధృవంపై ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటుంది. మైనస్ 180 నుంచి మైనస్ 230 డిగ్రీలు ఉంటుంది. అయితే ఇంత తీవ్రమైన చలిని ప్రజ్ఞాన్ రోవర్ తట్టుకుని తిరిగి పని చేయగలదా లేదా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా.. చంద్రుడిపై సూర్య కాంతి వస్తుండడంతో చంద్రయాన్-3 వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చూడాల్సి ఉందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ తెలిపారు. ఇప్పుడు చంద్రుడిపై సూర్యోదయం అయింది కాబట్టి, చంద్రయాన్-3 వ్యవస్థల్లో కదలిక వస్తే అవి శీతల వాతావరణాన్ని తట్టుకుని నిలబడినట్టు భావిస్తామని సోమ్ నాథ్ తెలిపారు.
Top Headlines @9PM : టాప్ న్యూస్
ఇదిలా ఉంటే.. చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23 సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. దీంతో చంద్రుడిపై ఈ భాగానికి చేరుకున్న తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రునిపై దిగిన తర్వాత.. ల్యాండర్, రోవర్, ఇతర పేలోడ్లు చాలా ముఖ్యమైన డేటాను పంపాయి. ల్యాండర్, రోవర్ ఒక చాంద్రమాన రోజు (సుమారు 14 రోజులు) వరకు పనిచేసేలా రూపొందించబడ్డాయి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!