Aditya-L1 Mission: తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 గురించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aditya-L1 Mission: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 గురించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన చేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ ఐఐటీ బొంబాయి వార్షిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్కు హాజరయ్యారు. ఈ ఫెస్టివల్లో ఆయన మిషన్కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ఆదిత్య-ఎల్1 స్పేస్క్రాఫ్ట్ తన విశ్వ గమ్యస్థానమైన లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్1)కి జనవరి 6న చేరుకోనుందని ప్రకటించారు. మూడు రోజుల వార్షిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్ట్లో ఎస్. సోమనాథ్ మాట్లాడుతూ.. ఆదిత్య-ఎల్1 జనవరి 6న సాయంత్రం 4 గంటలకు లాగ్రేంజ్ పాయింట్కు చేరుకోనుందని తెలిపారు. చంద్రయాన్-3 గొప్ప విజయాన్ని సాధించింది. ఇది మాకు పని చేయడానికి చాలా విశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. చంద్రయాన్-3 14 రోజుల తర్వాత మళ్లీ తన సేవలను అందిస్తుందని ఆశించామని, దాని సామర్థ్యం ద్వారా మేల్కొంటుందని ఆశించామని.. కానీ అది జరగలేదన్నారు.
Read Also: CM Siddaramaiah: సైన్ బోర్డులన్నీ కన్నడ భాషలోనే ఉండాలి.. సీఎం కీలక ప్రకటన
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
చాలా విషయాలు తప్పుగా జరిగి ఉండవచ్చు, అందుకే ఇది మళ్లీ మేల్కోలేకపోయిందన్నారు. బహుశా ప్రజ్ఞాన్ (రోవర్) మేల్కొన్నాడో లేదో ప్రజ్ఞాన్, విక్రమ్ మధ్య కమ్యూనికేషన్ ఏర్పడితే తప్ప అది తెలియదని ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. మేము 14 రోజుల్లో సేకరించిన ఏదైనా డేటా రాబోయే రోజుల్లో మాకు అద్భుతమైన శాస్త్రీయ ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు. శాస్త్రవేత్తలు ఇప్పుడు దానిపై పని చేస్తున్నారని ఇస్రో చీఫ్ చెప్పారు. ఈ వారం ప్రారంభంలో, గుజరాత్లోని వడోదరలో ఛత్ర సంసద్ నిర్వహించిన 7వ జాతీయ సమ్మేళనానికి బీజేపీ నాయకురాలు రివాబా జడేజాతో పాటు ఇస్రో చీఫ్ హాజరయ్యారు.
Read Also: Bomb Threat to Airports: దేశంలోని 7 ప్రధాన ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపు..
చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత, ఇస్రో సెప్టెంబర్ 2న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి దేశపు తొలి సౌర మిషన్ ఆదిత్య-ఎల్1ను ప్రయోగించింది. నెల ప్రారంభంలో, ఇస్రో తన తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 యొక్క ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (ASPEX)లో రెండవ పరికరం సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ (SWIS) పనిచేస్తుందని తెలియజేసింది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!