Israel-Hamas War: జెరూసలేం పై రాకెట్లు వర్షం.. గాజాలో నిరాశ్రయులైన 85శాతం జనాభా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ విమానాలు హమాస్ నియంత్రణలో ఉన్న గాజా స్ట్రిప్పై నిరంతరం బాంబు దాడులు చేస్తున్నాయి. ఈ యుద్ధం శనివారంతో 71 రోజులు పూర్తి చేసుకుంది. యుద్ధం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. హమాస్ చేతిలో ఉన్న ముగ్గురు బందీలను ఇజ్రాయెల్ సైన్యం అనుకోకుండా చంపేసింది. సైన్యం వారిని ముప్పుగా భావించి కాల్చి చంపింది.
బందీలను చంపడంపై ఇజ్రాయెల్లో కలకలం రేగుతోంది. ఇది విషాదకర ఘటన అని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఆగ్రహించిన ప్రజలు టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం వెలుపల ప్రదర్శనలు చేశారు. ఇజ్రాయెల్ సైన్యం గాజాకు అందించిన సహాయం తమ భూభాగం గుండా వెళుతుందని తెలిపింది. అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధం తర్వాత పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ ద్వారా సాయం అందడం ఇదే తొలిసారి.
Also Read
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
- CM Chandrababu: నా గ్రేట్ విజన్కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
- Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
Read Also:Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు శబరిమల యాత్రికులు మృతి
* ఐక్యరాజ్యసమితికి పాలస్తీనా మిషన్ ఇజ్రాయెల్ తన చట్టవిరుద్ధమైన ప్రవర్తనకు పరిణామాలను ఎదుర్కొంటుందని పేర్కొంది. ఇజ్రాయెల్పై చర్య తీసుకోవాలని మిషన్ భద్రతా మండలిని కోరింది. కాల్పుల విరమణ డిమాండ్ ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ పనిచేస్తోందని పేర్కొంది.
* అమెరికా NSA జాక్ సుల్లివన్ పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో మాట్లాడారు. ఈ సమయంలో గాజాలో ప్రజలకు పంపిన మానవతా సహాయాన్ని పెంచడంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో సాధారణ పౌరుల భద్రతను పెంచడంపై కూడా దృష్టి పెట్టారు.
* గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అల్ జజీరా కెమెరామెన్ సమీర్ అబు దబ్బా మరణించారు. దాడి జరిగినప్పుడు దక్కా హైఫా స్కూల్లో చిక్కుకున్నాడు. గాయపడిన కెమెరామెన్ వద్దకు అంబులెన్స్ చేరుకోలేకపోయింది, ఐదు గంటలపాటు నిరంతరాయంగా రక్తస్రావం కావడంతో అతను మరణించాడు.
* గాజా ఆరోగ్య వ్యవస్థ నాశనం కావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో 36 ఆసుపత్రులు ఉన్నాయి, వాటిలో 11 మాత్రమే కొంత మేరకు పనిచేస్తున్నాయి. 50 వేల మందికి పైగా క్షతగాత్రులు ఈ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్యులు, నర్సులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
* యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల కోసం రెండు దేశాల పరిష్కారానికి యూరోపియన్ యూనియన్ మద్దతు ఇస్తుందని అన్నారు. దీనిపై ఏకాభిప్రాయం కుదరనంత వరకు శాంతిభద్రతలు ఉండవని అంటున్నారు.
Read Also:SBI Notification 2023: ఎస్బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. ఒక్కరోజే గడువు..
* జెరూసలేం వైపు అనేక రాకెట్లు ప్రయోగించబడినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. సైన్యం కనీసం ఆరు రాకెట్లను గుర్తించింది. వీటిలో మూడు రాకెట్లను అడ్డగించగా, మిగిలిన మూడు రాకెట్లను అడ్డుకోలేదు అవి బహిరంగ ప్రదేశంలో పడ్డాయి.
* ఇజ్రాయెల్ వైపు వెళ్తున్న రెండు కార్గో షిప్లపై దాడి చేసినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
* మానవతా సహాయంతో కూడిన 106 ట్రక్కుల కాన్వాయ్ శుక్రవారం రఫా క్రాసింగ్ గుండా గాజాకు చేరుకుందని ఈజిప్టు అధికారి ఒకరు తెలిపారు. ఇందులో ఐదు ట్రక్కులు ఇంధనాన్ని తీసుకెళ్తున్నాయి. 441 మంది విదేశీయులు, నలుగురు గాయపడిన పాలస్తీనియన్లతో సహా మొత్తం 445 మంది గాజా స్ట్రిప్ నుండి బయలుదేరారు.
* అక్టోబర్ 7 నుండి, ఇజ్రాయెల్ గాజాలోని 22 వేలకు పైగా లక్ష్యాలపై బాంబు దాడి చేసింది. దీని కారణంగా 19 లక్షల మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. ఇది గాజా జనాభాలో 85 శాతం. నిరాశ్రయులైన ప్రజలు చలి, వర్షం వంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
* యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా కనీసం 18,700 మంది పాలస్తీనియన్లు గాజాలో మరణించారు. గాయపడిన వారి సంఖ్య దాదాపు 51000.
తాజావార్తలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
-
CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
-
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!