Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు శబరిమల యాత్రికులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: కేరళలోని మలప్పురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి శబరిమల యాత్రికులు వెళ్తున్న ఆటో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఆటో డ్రైవర్తో పాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలోనే కొంతమంది గాయపడ్డారు, వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు.
Read Also:SBI Notification 2023: ఎస్బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. ఒక్కరోజే గడువు..
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
#WATCH | Malappuram, Kerala: Auto driver and 4 passengers of an auto died after the auto collided with a bus of Sabarimala pilgrims coming from Karnataka (15/12)
(Visuals of injured being taken to hospital) pic.twitter.com/rK3K6sYWAo
— ANI (@ANI) December 15, 2023
ఈ ప్రమాదం జరగడంతో ఘటనా స్థలంలో విషాదఛాయలు అలముకున్నాయి. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం బస్సు, ఆటో డ్రైవర్ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణాల వల్ల జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ శశిధరన్ ఎస్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంపై మోటారు వాహన శాఖ సహకారంతో పోలీసులు విచారణ జరుపుతారని తెలిపారు.
Read Also:Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
ఆటోడ్రైవర్ తానిపర పుతుపరంబం అబ్దుల్ మజీద్ (50), కారువారకుండ్ వలయూర్కు చెందిన భార్య తస్నీమా (33), పిల్లలు రిన్షా ఫాతిమా (12), రైహా ఫాతిమా (4), తస్నీమా సోదరి, కుట్టిపర హమీద్ భార్య ముహ్సీనా (35) మృతి చెందారు. గాయపడ్డ ఐదుగురిలో తస్నీమా కుమారుడు మహమ్మద్ రేయాన్ (ఏడాది) పరిస్థితి విషమంగా ఉంది. తస్నీమా తల్లి సబీరా (58), ముహ్సినా పిల్లలు ఫాతిమా హసా, మహమ్మద్ హసన్, ముహమ్మద్ మిషాద్ ఉన్నారు. వారు మంచిరి, కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికీ గాయాలు కాలేదు. బస్సు ముందు భాగం దెబ్బతింది.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!