Shardul Thakur: జట్టు కోసం 102 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్ చేశాడు.. చివరికి ఆసుపత్రిలో చేరాడు!
- ఇరానీ కప్ 2024లో శార్దూల్ ఠాకూర్
- జ్వరంతోనే బ్యాటింగ్ చేసిన శార్దూల్
- ఆసుపత్రిలో చేరిన ఆల్రౌండర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ అనారోగ్యానికి గురయ్యాడు. 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూనే.. జట్టు కోసం బ్యాటింగ్ చేసిన శార్దూల్ను మ్యాచ్ అనంతరం ముంబై టీమ్ మేనేజ్మెంట్ లక్నోలోని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. శార్దూల్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. 2024 ఇరానీ కప్ టోర్నీలో శార్దూల్ ముంబై జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇరానీ కప్ పోరులో ముంబై, రెస్టాఫ్ ఇండియా టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 1న మ్యాచ్ ఆరంభం అయింది. రెస్టాఫ్ ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై మొదటి ఇన్నింగ్స్లో రెండో రోజు ముగిసేసరికి 138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 536 రన్స్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (221 నాటౌట్; 276 బంతుల్లో 25×4, 4×6) డబుల్ సెంచరీ బాదాడు. ఇరానీ కప్లో డబుల్ సెంచరీ సాధించిన మొదటి ముంబై ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
Also Read
Also Read: Rishabh Pant: పంత్ను రిటైన్ చేసుకుంటాం: పార్థ్ జిందాల్
ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ తొలి రోజే అనారోగ్యంతో కన్పించాడు. అయినప్పటికీ రెండో రోజు బ్యాటింగ్కు వచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్తో కలిసి శార్దూల్ (36; 59 బంతుల్లో 4×4, 1×6) జట్టుకు భారీ స్కోరు అందించాడు. 102 డిగ్రీల జ్వరంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ.. జట్టు కోసం బ్యాటింగ్ కొనసాగించాడు. మ్యాచ్ అనంతరం జ్వరం మరింత ఎక్కువ కావడంతో ముంబై మేనేజ్మెంట్ అతడికి లక్నోలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చింది. శార్దూల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడికి మలేరియా, డెంగీ వంటి పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అతడు ఆడే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
తాజావార్తలు
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!