Rishabh Pant: పంత్ను రిటైన్ చేసుకుంటాం: పార్థ్ జిందాల్
- నవంబర్లో మెగా వేలం
- అక్టోబర్ 30 చివరి గడువు
- పంత్ను రిటైన్ చేసుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలంకు ముందు ఫ్రాంఛైజీలు ఎంత మందిని రిటైన్ చేసుకోవచ్చనే దానిపై స్పష్టత వచ్చింది. ప్రతి ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్ పాలకవర్గం అనుమతిని ఇచ్చింది. ఇందులో ఓ రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఉంది. నవంబర్లో వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి. మెగా వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. తమను రిషబ్ పంత్ను కచ్చితంగా రిటైన్ చేసుకుంటామని తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ వెల్లడించారు.
పార్థ్ జిందాల్ మాట్లాడుతూ… ‘కచ్చితంగా ఆరుగురిని రిటైన్ చేసుకుంటాం. ఢిల్లీ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. రిటెన్షన్ రూల్స్పై ఇప్పుడే స్పష్టత వచ్చింది. జీఎంఆర్, మా క్రికెట్ ఆఫ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. రిషబ్ పంత్ను మేం రిటైన్ చేసుకుంటాం. అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, జేక్ ఫ్రేజర్ మెకెర్క్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరెల్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్.. లాంటి మంచి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వేలంలో ఏం జరుగుతుందో చూడాలి. చర్చలు జరిపిన తర్వాత వేలానికి సిద్ధమవుతాం’ అని అన్నారు.
Also Read
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
Also Read: T20 World Cup 2024: నేటి నుంచే టీ20 ప్రపంచకప్.. తొలి పోరులో బంగ్లాదేశ్తో స్కాట్లాండ్ ఢీ!
ప్రాంఛైజీలు తన రిటైన్ లిస్టును సమర్పించడానికి అక్టోబర్ 30 చివరి గడువు. 2016 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రిషబ్ పంత్ ఆడుతున్న విషయం తెలిసిందే. 2021 నుంచి కెప్టెన్గా కొనసాగుతున్నాడు. 2022లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. 2023 ఐపీఎల్ ఆడలేదు. ఐపీఎల్ 2024లో పునరాగమనం చేశాడు. బ్యాటర్, కెప్టెన్గా సత్తాచాటాడు.
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!