Iran Attack: హిందూ మహాసముద్రంలోని ‘డియాగో గార్సియా’పై ఇరాన్ దాడి.. రెండు క్షిపణుల ప్రయోగం..
- హిందూ హహాసముద్రంలోని అమెరికా స్థావరంపై దాడి..
- రెండు క్షిపణులు ప్రయోగించి ఇరాన్..
- అవి విఫలం అయినట్లు సమచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్లకు చెందిన అత్యంత కీలకమైన ‘డియాగో గార్సియా’ సైనిక స్థావరంపై ఇరాన్ దాడికి ప్రయత్నించిందని ప్రముఖ వార్తా సంస్థ ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. అయితే.. ఈ దాడిలో ఆ స్థావరానికి ఎటువంటి నష్టం జరగలేదు.
ఏం జరిగింది..?
Also Read
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
నివేదికల ప్రకారం.. ఇరాన్ రెండు శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించింది. అందులో ఒకటి గాలిలోనే విఫలం కాగా.. మరొకటి లక్ష్యాన్ని చేరుకోకుండానే అమెరికా యుద్ధనౌక అడ్డుకుంది. అయితే.. ఈ దాడి ఎప్పుడు జరిగిందనే కచ్చితమైన వివరాలను మాత్రం వెల్లడించలేదు. అమెరికా స్థావరాన్ని వాడుకుని ఇరాన్పై దాడులు చేయడానికి బ్రిటన్ అనుమతి ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఈ చర్యకు పాల్పడటం గమనార్హం.
Also Read:Iranian oil: ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. ఏప్రిల్ 19 వరకు అమలు..
సాధారణంగా ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణులు కేవలం 2,000 నుంచి 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించగలవని అందరూ భావించేవారు. కానీ.. ఇరాన్ నుంచి డియాగో గార్సియా స్థావరం సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఇరాన్ గురిపెట్టడం చూస్తుంటే.. వారి క్షిపణుల పరిధి ప్రపంచం ఊహించిన దానికంటే చాలా ఎక్కువని అర్థమవుతోంది.
Also Read:SBI: ఎస్బీఐకి బిగ్ షాక్.. రూ.6,338 కోట్ల పన్ను కట్టాలని నోటీసులు..
నివేదికల ప్రకారం.. ఇరాన్ వద్ద ప్రస్తుతం సుమారు 2,500 నుంచి 3,000 వరకు క్షిపణులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. ఖోరంషహర్. ఇది 2,000 నుంచి 3,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇమాద్ 1,600 నుంచి 2,000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. షహాబ్-3 అండ్ రిజ్వాన్.. ఇవి సుమారు 1,400 కిలోమీటర్ల వరకు వెళ్లగలవు. అమెరికాకు చెందిన బాంబర్ విమానాలు మధ్య ప్రాచ్యంలో దాడులు చేయడానికి ఈ ‘డియాగో గార్సియా’ స్థావరం ఒక ముఖ్యమైన స్థావరం. ఇప్పుడు ఇరాన్ క్షిపణులు అక్కడికి కూడా చేరుకోగలవని తెలియడంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!