Iran: ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకై పేలుడు.. 51 మంది మృతి
- ఆదివారం ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకై భారీ పేలుడు
- ఈ ఘటనలో 51 మంది మృతి
- 20 మందికి గాయాలు
- ఇరాన్లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్లో ఈ పేలుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది మృతి చెందారు. అంతేకాకుండా.. 20 మంది గాయపడ్డారు. గత కొన్నేళ్లుగా దేశంలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఇదొకటి అని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరాన్లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్లో ఈ పేలుడు సంభవించింది. తూర్పు ఇరాన్లోని తబాస్ గనిలో పేలుడు సంభవించినట్లు అధికారిక IRNA వార్తా సంస్థ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 70 మంది ఉద్యోగులు సైట్లో ఉన్నారు.
నివేదిక ప్రకారం.. గనిలోని రెండు బ్లాకులలో పేలుడు సంభవించింది. ఈ గని ప్రైవేట్ ఇరానియన్ సంస్థ మదంజూ యాజమాన్యంలో ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు తబాస్కు అంబులెన్స్లు, హెలికాప్టర్లు సహాయం అందించాయి. అలాగే.. కొంతమంది బాధితుల మృతదేహాలను మైనింగ్ వాహనాలలో ఆస్పత్రికి తీసుకెళ్లాయి. మిగిలిన మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్లు పనిచేస్తున్నాయని సౌత్ ఖొరాసన్ గవర్నర్ జవాద్ ఘెనాట్ స్టేట్ టీవీకి తెలిపారు.
Also Read
- Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
- Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
Snake In Train: రైలు ఏసీ కోచ్లో పాము.. వైరల్ అవుతున్న వీడియో..
ప్రమాదంపై విచారణకు రాష్ట్రపతి ఆదేశించారు
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే. సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. “దురదృష్టవశాత్తూ తబాస్లోని బొగ్గు గనులలో ప్రమాదం జరిగిందని.. మా ప్రజలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలుసుకున్నాము. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పెజెష్కియాన్ అన్నారు.
ఖొరాసన్లో 3 రోజుల బహిరంగ సంతాపం
బాధితులకు, వారి కుటుంబాలకు అత్యవసర సహాయాన్ని అందించడానికి తన మొదటి వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రెజా అరేఫ్ క్యాబినెట్ సభ్యులతో మాట్లాడినట్లు IRNA తెలిపింది. పేలుడు సంభవించిన తరువాత అధికారులు ప్రావిన్స్లో మూడు రోజుల బహిరంగ సంతాప దినాలు ప్రకటించారు. అలాగే.. ఇరాన్ రెడ్ క్రెసెంట్ గని వద్ద శోధన, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని.. ఇంకా కొంతమంది కార్మికులు చిక్కుకున్నారని చెప్పారు. IRNA ప్రకారం, ఈ ఉద్యోగులు భూమి ఉపరితలం నుండి 250 మీటర్ల దిగువన ఉన్నారు.
తాజావార్తలు
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
ట్రెండింగ్
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!