IPL Orange Cap: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మార్చి 28న తొలి మ్యాచ్ తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఐపీఎల్ లీగ్ ద్వారా అనేక మంది ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇకపోతే ఈ టోర్నీ చరిత్రలో చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి “ఆరెంజ్ క్యాప్” అందిస్తారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి స్టార్ బ్యాట్స్మెన్ భారీగా పరుగులు చేసినప్పటికీ.. ఈ అవార్డును అత్యధికసార్లు గెలిచిన ఆటగాడు మాత్రం వేరే ఉన్నారు. అతడు మరెవరో కాదు ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ “డేవిడ్ వార్నర్”.
Virosh: పెళ్ళికి పిలవలేదని రీల్ చేసిన చిన్నారి.. ఇంటికి పిలిపించుకుని షాకిచ్చిన దేవరకొండ దంపతులు
ఐపీఎల్ తొలి సీజన్ (2008)లో షాన్ మార్ష్ 616 పరుగులతో మొదటి ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. 2009లో మాథ్యూ హెడెన్ 572 పరుగులతో ఈ అవార్డును దక్కించుకున్నాడు. 2010లో సచిన్ టెండూల్కర్ 618 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు.ఆ తర్వాత 2011, 2012 సీజన్లలో క్రిస్ గేల్ వరుసగా 608, 733 పరుగులతో రెండు సార్లు గెలిచి కొత్త రికార్డు సృష్టించాడు. ఆపై 2013లో మైఖేల్ హస్సి 733 పరుగులతో టాప్ లో నిలిచాడు. 2014లో రాబిన్ ఉతప్ప 660 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. ఇక 2015లో డేవిడ్ వార్నర్ మొదటిసారి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు.
ఆ తర్వాత 2016లో విరాట్ కోహ్లీ 973 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటికీ ఎవరూ చెరిపివేయలేకపోయారు. 2017లో మళ్లీ డేవిడ్ వార్నర్ 641 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. 2018లో కేన్ విలియంసన్ 735 పరుగులతో టాప్లో నిలిచాడు. 2019లో మరోసారి వార్నర్ 692 పరుగులతో మరోసారి ఆరెంజ్ క్యాప్ గెలిచి ముచ్చటగా మూడు సార్లు ఈ అవార్డును గెలిచిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
