IPL 2026 టిక్కెట్లపై వివాదం.. బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్..!
- ఐపీఎల్ 2026 టికెట్లపై కర్ణాటకలో వివాదం
- కాంగ్రెస్ ఎమ్మెల్యే శివశంకరప్ప కేఎస్సీఏపై ఆరోపణలు
- ఉచిత టికెట్లు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయం అంటూ విమర్శలు
- రూ.5,000 టికెట్ను రూ.35,000కి విక్రయిస్తున్నారన్న ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Tickets: కర్ణాటకలో ఐపీఎల్ 2026 టికెట్ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాశప్పనవర్ విజయానంద శివశంకరప్ప కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)పై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన ఉచిత టికెట్లను ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. మార్చి 28న ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. మీడియాతో మాట్లాడిన శివశంకరప్ప, “ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు పొందుతున్న కేఎస్సీఏ, ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడం లేదు. ఒక్క టికెట్ ధర రూ.5,000 ఉండగా, అదే టికెట్ను రూ.35,000కు బ్లాక్లో కొనాల్సి వస్తోంది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
IPL 2026 Second Phase: ఐపీఎల్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఆ లిస్ట్ ఇదే..
Also Read
- Justin Greaves: టెస్ట్ చరిత్రలో అరుదైన రికార్డు.. ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు నేలకూల్చిన వెస్టిండీస్ పేసర్.!
- Pavala Shyamala: టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత..!
- VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
- Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
ఇదిలా ఉండగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ను ప్రకటించింది. ఈ దశ మార్చి 28 నుంచి మే 24 వరకు జరుగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ అయిన ఐపీఎల్ 2026 19వ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలపడనుంది. మొదటి దశలో మొత్తం 20 మ్యాచ్ లు దేశంలోని 10 వేదికల్లో జరుగనున్నాయి. రెండో దశలో ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు 12 వేదికల్లో మొత్తం 50 మ్యాచ్లు జరగనున్నాయి. బెంగళూరు, ముంబై, గువాహటి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి నగరాలు ఈ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తాయి. ఈ దశలో డబుల్ హెడ్డర్లు ఉండగా, మధ్యాహ్న మ్యాచ్లు 3:30 గంటలకు, సాయంత్రం మ్యాచ్లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
West Bengal Elections: మమతా బెనర్జీ ఇలాఖాలో బీజేపీ ‘‘శ్రీరామ నవమి’’ ర్యాలీ..
ప్రారంభ మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడనుంది. ఏప్రిల్ 4న తొలి డబుల్ హెడ్డర్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరగగా, అదే రోజు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మరో మ్యాచ్ జరుగుతుంది. ఇక జట్ల హోం వేదికల విషయంలో కూడా మార్పులు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ గువాహటిలో తమ హోం మ్యాచ్ లను ప్రారంభించనుండగా.. పంజాబ్ కింగ్స్ న్యూ చండీగఢ్, ధర్మశాలలో మ్యాచ్లు ఆడనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ హోం మ్యాచ్లను బెంగళూరు, రాయపూర్ లలో ఆడనుంది.
తాజావార్తలు
-
Virat Kohli Anushka: లండన్లో ఉన్నా భారత్లో పెట్టుబడులు.. మరో లగ్జరీ ఇల్లు సొంతం చేసుకున్న విరాట్, అనుష్క
-
Justin Greaves: టెస్ట్ చరిత్రలో అరుదైన రికార్డు.. ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు నేలకూల్చిన వెస్టిండీస్ పేసర్.!
-
Sharmila Dhankhar: పోలియోను జయించి చరిత్ర సృష్టించిన షర్మిలా ధన్ఖర్.. పారా షాట్పుట్లో స్వర్ణం
-
Pavala Shyamala: టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత..!
-
Abqaiq Refinery Fire: ఇరాక్ డ్రోన్ దాడులు.. సౌదీ అరేబియాలోని అబ్కైక్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!