Ajinkya Rahane: మేము గెలవాల్సిన మ్యాచ్.. ఓపెనింగ్ సరిగా లేదు!
- గుజరాత్పై కోల్కతా 39 పరుగుల తేడాతో ఓటమి
- 8 మ్యాచ్ల్లో కోల్కతా ఖాతాలో అయిదో ఓటమి
- కోల్కతా ఓటమిపై స్పందించిన కెప్టెన్ రహానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ బౌలింగ్ విభాగం బాగుందని, ఓపెనింగ్ సరిగా లేదని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తెలిపాడు. సరైన ఓపెనింగ్ లేక టోర్నమెంటంతా ఇబ్బంది పడుతున్నామన్నాడు. గుజరాత్ టైటాన్స్పై మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేదఐ పేర్కొన్నాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ బాగా చేయలేదని, మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు కూడా నమోదు చేయలేకపోతున్నామని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. 8 మ్యాచ్ల్లో కోల్కతా అయిదో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
మ్యాచ్ అనంతరం కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. ‘199 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తాం అనుకున్నాం. భారీ ఛేదనలో ఓపెనింగ్ ఆరంభం బాగుండాలి. మా జట్టు ఓపెనింగ్ సరిగా లేదు. ఈ టోర్నమెంటంతా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాము. నిజానికి మా బౌలింగ్ విభాగం బాగుంది. బ్యాటింగ్లోనే మేము తడబడ్డాము. మేం మా తప్పుల నుంచి తొందరగా నేర్చుకోవాల్సి ఉంది. ఈ పిచ్ కాస్త నెమ్మదిగా ఉంది. ప్రత్యర్థి జట్టును 200 లేదా 210లోపు కట్టడి చేయాలనుకున్నాం. మాకు ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసు. గుజరాత్ను కట్టడి చేయడంలో సఫలం అయ్యాము’ అని జింక్స్ చెప్పాడు.
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
Also Read: Gold Rate Today: లక్ష కాదు అంతకు మించి.. లక్ష దాటిన బంగారం ధర
‘మేం మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో తేలిపోయాం. భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు కూడా నమోదు చేయలేకపోతున్నాం. బ్యాటింగ్ యూనిట్గా మేము మెరుగుపడాలి. మా బౌలర్ల గురించి నాకు ఎలాంటి ఆనందోళన లేదు. ప్రతి మ్యాచ్కూ రాటుదేలుతున్నారు. ఫీల్డింగ్లో మరింత మెరుగ్గా ఉంటే 15 నుంచి 20 పరుగులు ఆపి ఉండేవాళ్లం. ఫీల్డింగ్పై మా ప్లేయర్స్ బాగానే దృష్టి పెడుతున్నారు. టీ20 ఫార్మాట్లో ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి. గతం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మా బ్యాటర్లు పరుగులు చేయడంపై ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మాకు మిడిల్ ఆర్డర్లో నాణ్యమైన బ్యాటర్లు ఉన్నారు. నేను వారిని అండగా ఉంటా. అంగ్క్రిష్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు’ అని రహానే చెప్ప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!