Rohit Sharma: ఐపీఎల్ 2025 తర్వాతే రోహిత్ శర్మ నిర్ణయం!
- ఇప్పటికే టీ20 ఫార్మాట్కు రోహిత్ శర్మ వీడ్కోలు
- ఐపీఎల్ 2025 తర్వాత టెస్ట్ రిటైర్మెంట్పై నిర్ణయం
- 2027 నాటికి 40 ఏళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే టీ20 ఫార్మాట్కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వన్డేలకూ గుడ్బై చెబుతాడని అంతా భావించారు. అయితే తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదంటూ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో మరో రెండేళ్ల పాటు హిట్మ్యాన్ కొనసాగే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్ 2027, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్లోనూ ఆడతాడని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. వన్డే ప్రపంచకప్ తన కల అని రోహిత్ చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read: IPL 2025-Uppal Stadium: ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు.. రూ.5 కోట్లతో రినోవేషన్ పనులు!
Also Read
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
రోహిత్ శర్మ వచ్చే నెల 23న 38వ పడిలోకి అడుగుపెడతాడు. 2027 నాటికి 40 ఏళ్లు వస్తాయి. అప్పటివరకు రోహిత్ జట్టులో కొనసాగాలంటే.. ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఫిట్నెస్తో పాటు బ్యాటింగ్లో ఫామ్ కీలకం. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో కలిసి ఫిట్నెస్ కోసం రోహిత్ పనిచేయనున్నట్లు సమాచారం. రోహిత్ వన్డే భవితవ్యంపై ఓ క్లారిటీ ఉన్నా.. టెస్టు భవిష్యత్తుపై మాత్రం క్లారిటీ రాలేదు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2025లో రోహిత్ విఫలమయ్యాడు. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. పేలవ ఫామ్ కారణంగా.. చివరి టెస్ట్ మ్యాచ్ నుంచి స్వయంగా తప్పుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత టెస్టు కెరీర్పై రోహిత్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి హిట్మ్యాన్ టెస్టులు ఆడుతాడో లేదో.
తాజావార్తలు
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!