IPL 2025 Mega Auction: నెస్ వాడియాతో షారుఖ్ ఖాన్ వాగ్వాదం.. కావ్య మారన్ మద్దతు!
- మెగా వేలంకు సంబంధించి ముంబైలో సమావేశం
- మరోసారి భేటీ జరిగే అవకాశం
- వేలంను వ్యతిరేకించిన షారుఖ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavya Maran Suppots Shah Rukh Khan in IPL 2025 Auction Meeting: 2025 మెగా వేలంకు సంబంధించి ఐపీఎల్ పాలక మండలి, పది ఫ్రాంచైజీల యజమానుల మధ్య ముంబైలో సమావేశం జరిగింది. బుధవారం రాత్రి వరకూ జరిగిన ఈ భేటీలో మెగా వేలం నిర్వహణ, రిటెన్షన్ పాలసీ, ఇంపాక్ట్ రూల్పై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఐపీఎల్ పాలక మండలి, ఫ్రాంచైజీల యజమానుల మధ్య వాడివేడిగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. బీసీసీఐ మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండానే ఈ భేటీని ముగించింది. మరోసారి భేటీ జరిగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
అయితే ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వహణకు చాలా ఫ్రాంచైజీలు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్ సహా యజమాని షారుఖ్ ఖాన్ మెగా వేలంను వ్యతిరేకించినట్లు ఐపీఎల్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. షారుఖ్కు ఎస్ఆర్హెచ్ సీఈఓ కావ్య మారన్ మద్దతు పలికినట్లు సమాచారం. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ సహా యజమాని నెస్ వాడియా, షారుఖ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందట. షారుఖ్ ఎక్కువ మందిని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతుండగా.. నెస్ మాత్రం అవసరం లేదని వాదించినట్లు సమాచారం. తప్పనిసరిగా మెగా వేలం నిర్వహించాలని పంజాబ్ ఓనర్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read
- Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
- ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
- Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
- YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
Also Read: SC/ST Sub-Classification: ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004లోనే చెప్పా: మంద కృష్ణ మాదిగ
కనీసం 8 మందిని (నలుగు ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం లేదా ఇద్దరు ఆటగాళ్లను ఆర్టీఎమ్ ద్వారా) రిటైన్ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ఎస్ఆర్హెచ్ సీఈఓ కావ్య మారన్ కోరినట్లు తెలుస్తోంది. విదేశీ ప్లేయర్లలో అదనంగా మరికొందరిని అట్టిపెట్టుకొనే అవకాశం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారట. గాయంతో కాకుండా ఇతర కారణాలతో వైదొలిగే విదేశీ ఆటగాళ్లను టోర్నీ నుంచి నిషేధించాలిని బీసీసీఐకి కావ్య చెప్పారట. ఈ సమావేశంకు షారుఖ్ ఖాన్ (కోల్కతా), కిరణ్ కుమార్ గ్రంథి (ఢిల్లీ), సంజీవ్ గోయెంకా (లక్నో), నెస్ వాడియా (పంజాబ్), రూపా గురునాథ్ (చెన్నై), కావ్యా మారన్ (హైదరాబాద్), మనోజ్ బదాలే (రాజస్థాన్) తదితరులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
-
Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
-
Mr Perfect Copyright Case: దిల్రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..