Tirumala: నడకమార్గంలో డీఎస్పీ గుండెపోటుతో మృతి.. ప్రధాని మోడీ పర్యటన కోసం వచ్చి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఈ రోజు తెలంగాణకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. మధ్యలో తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.. మూడు రోజుల పాటు తెలంగాణలో పీఎం పర్యటన కొనసాగనుండగా.. ఈ నెల 26వ తేదీన సాయంత్రానికి తిరుమల వెళ్లి.. 27న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.. అయితే, ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా.. భద్రతా ఏర్పాట్లలో మునిగిపోయారు పోలీసులు.. ఇక, తిరుమల శ్రీవారి నడకదారిలో ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ గుండెపోటుతో మృతిచెందారు. ప్రధాని మోడీ తిరుమల పర్యటనలో భాగంగా భద్రతా విధుల్లో భాగంగా తిరుమలకు వెళ్లారు డీఎస్పీ కృపాకర్. ఈ రోజు ఉదయం మెట్ల మార్గాన్ని పరిశీలిస్తుండగా.. 1,805 మెట్టు వద్ద గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు కృపాకర్.. వెంటనే అప్రమత్తమైన ఆయనతో ఉన్న పోలీసులు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ఆయన ప్రాణాలు విడిచినట్టుగా చెబుతున్నారు. డీఎస్పీ కృపాకర్ స్వస్థలం వియవాడ సమీపంలోని పోరంకి కాగా.. ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వచ్చి తిరుమలలో మృతి చెందారు.
Read Also: DK. Shivakumar: కేసీఆర్ అబద్ధాల కోరు.. రైతులకు సరిపడా కరెంట్ ఇస్తున్నాం..
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!