UP: ఇన్స్టా రీల్స్ ఎఫెక్ట్.. 14 ఏళ్ల మైనర్ బాలుడితో 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి ప్రేమాయణం.. కట్చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ఇన్స్టాగ్రామ్ రీల్స్.. చాలా మందికి కాలక్షేపంగా మారింది. కానీ, అదే ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూపీలో ఒక విచిత్రమైన ఉదంతానికి దారితీశాయి. లైక్లు కొట్టుకోవడంతో మొదలైన పరిచయం.. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి, ఓ 14 ఏళ్ల మైనర్ బాలుడి ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మహారాజ్గంజ్ జిల్లాలోని నౌతన్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గోరఖ్పూర్కు చెందిన 40 ఏళ్ల ఓ మహిళకి, చెన్నైలో తన తండ్రితో కలిసి ఉంటున్న 14 ఏళ్ల బాలుడికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఒకరి రీల్స్ను ఒకరు లైక్ చేసుకుంటూ, కామెంట్లు పెట్టుకుంటూ మొదలైన ఈ సోషల్ మీడియా స్నేహం కాస్తా, కాలక్రమేణా ప్రేమగా మారింది. ఆ బాలుడు తన పెద్ద కొడుకు కంటే ఐదేళ్లు చిన్నవాడనే విషయాన్ని సైతం ఆమె పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఆ మైనర్ బాలుడు తనను పెళ్లి చేసుకున్నాడని, కానీ ఇప్పుడు తనతో కలిసి ఉండటానికి నిరాకరిస్తూ మొహం చాటేస్తున్నాడంటూ సదరు మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ విచిత్రమైన ఫిర్యాదుతో పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వయసులో ఇంత వ్యత్యాసం ఉండటం, పైగా బాలుడు మైనర్ కావడంతో ఈ విషయం కాస్తా చుట్టుపక్కల ప్రాంతాల్లో దావానలంలా వ్యాపించి, స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి అధికారిక క్రిమినల్ కేసు నమోదు చేయలేదు. దానికి బదులుగా ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పరస్పర అవగాహనతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే స్థానిక పెద్దలు, పోలీసులు చేసిన చర్చలు, కౌన్సెలింగ్ తర్వాత ఆ మహిళ మనసు మార్చుకుంది. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి చట్టపరమైన చర్యలు అవసరం లేదని, కేసు పెట్టదలుచుకోలేదని పోలీసులకు రాతపూర్వకంగా తెలిపింది. భవిష్యత్తులో ఒకరినొకరు అసలు సంప్రదించకూడదని, ఎలాంటి పరిచయాలు పెట్టుకోకూడదని ఇరువైపులా అంగీకారం కుదరడంతో ఈ వివాదం ప్రశాంతంగా ముగిసిందని నౌతన్వా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ బసంత్ సింగ్ వెల్లడించారు.
Also Read
- American Independence: అమెరికా స్వాతంత్య్రానికి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ సహాయం.. ఎలాగంటే..
- Govt Hikes Price: ఉల్లి రైతులకు భారీ శుభవార్త.. రైతుల పంట పండినట్లే..
- Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..!
- PM Modi: ‘వాళ్లంతా తప్పుదోవ పట్టించారు’.. అయినా ఇంధన సంక్షోభాన్ని జయించాం
ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వయసు వ్యత్యాసం, డిజిటల్ ప్రేమల తీరుపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలకు, ముఖ్యంగా మైనర్లకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, పరిచయాలు పెంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అలాగే, పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనే విషయాలపై తల్లిదండ్రులు కచ్చితంగా నిఘా ఉంచాలని, వారి ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడం చాలా ముఖ్యమని పోలీసులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
American Independence: అమెరికా స్వాతంత్య్రానికి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ సహాయం.. ఎలాగంటే..
-
Govt Hikes Price: ఉల్లి రైతులకు భారీ శుభవార్త.. రైతుల పంట పండినట్లే..
-
Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..!
-
Tollywood Heros: రిస్కీ ప్రాజెక్టులతో టెన్షన్లో టాలీవుడ్ హీరోలు
-
PM Modi: ‘వాళ్లంతా తప్పుదోవ పట్టించారు’.. అయినా ఇంధన సంక్షోభాన్ని జయించాం
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..